టాలీవుడ్ లో రౌడీ హీరో అన్న ఇమేజ్ ని క్రియోట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు కమిటవుతు వస్తున్నాడు. ఆ మద్య వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండసినిమా ఆశించినంతగా సక్సస్ ని అందుకోలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాపులొచ్చినా మన విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

 

ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ తెరకెక్కించే సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఇక ఈ సినిమా తర్వాత నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించబోయో సినిమాలో నటిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు మరో రెండు సినిమాలు రెడీగా ఉన్నాయట. దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. శివ నిర్వాణ సినిమా అయిపోగానే దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేస్తాడట.

 

అంతేకాదు అర్జున్ రెడ్డి కాంబో కూడా మరోసారి రిపీట్ కానుందని సమాచారం. ఇప్పటికే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా విజయ్ దేవరకొండ కి ఒక కథ చెప్పి ఒప్పించాడట. అయితే ఈ సినిమా అర్జున్ రెడ్డి కి సీక్వెలా కాదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ కాంబోలో వచ్చే సినిమా మాత్రం అర్జున్ రెడ్డి మాదిరిగా ట్రెండ్ సెట్టర్ అవడం మాత్రం ఖాయమట. 

 

ఇవే కాదు 2021 లో మరో ప్రాజెక్ట్ కూడా లైన్ లో పెట్టాడట విజయ్ దేవరకొండ. నేచురల్ స్టార్ నాని తో జెంటిల్ మాన్ సినిమాని తీసిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. అంతేకాదు ఒక క్లాస్ సబ్జెక్ట్ ని విజయ్ కోసం ఇంద్రగంటి మోహన కృష్ణ సిద్దం చేస్తున్నారని అంటున్నారు.

 

అయితే ప్రస్తుతం అనుకున్న సినిమాలన్ని పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక తెరకెక్కేవే. ఎందుకంటే పూరి విజయ్ తో తీసే సినిమా పాన్ ఇండియా సినిమా. మరి ఈ సినిమా సక్సస్ అయితే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో విజయ్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే లాక్ డౌన్ ఎత్తేశాక విజయ్ దేవరకొండ దూకుడు మామూలుగా ఉండదనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: