టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి కి కమర్షియల్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ అన్న పేరు వచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రాం తో తెరకెక్కించిన పటాస్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు వచ్చిన సినిమాలతో వరస హిట్స్ ని అందుకొని విపరీతమైన క్రేజ్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి కోసం కొంతమంది హీరోలు సినిమా చేసేందుకు ఆసక్తిని చూపించడం గొప్ప విషయం. ఇక టాలీవుడ్ లో ఇప్పటి వరకు సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ గా రాజమౌళి, కొరటాల శివ సాధించిన క్రేజ్ ని ఆ తర్వాత అనిల్ రావిపూడి మాత్రమే దక్కించుకున్నాడు.

 

అయితే ఈ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిందని లేటెస్ట్ న్యూస్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి ఎఫ్ 2 ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సస్ తోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చాడు. ఇక ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అవడంతో ఈ మల్టీస్టారర్ కి సీక్వెల్ గా ఎఫ్ 3 ని నిర్మించాలని దిల్ రాజు అనిల్ రావిపూడి తో అప్పుడే ప్లాన్ చేశాడు.

 

అయితే ప్రస్తుతం కరోనా వ్యాపించి ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామాలు నెలకొన్నాయి. చిన్న సినిమా నిర్మాతల దగ్గర్నుంచి భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించే నిర్మాతలవరకు అందరూ ఇప్పటి నుంచి నిర్మించాలనుకుంటున్న సినిమాల విషయంలో జాగ్రత్తలు వహిస్తున్నారు. అంతేకాదు ఒక సినిమా ప్లాన్ చేయాలంటే ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 ఈ సంవత్సరం పట్టాలెక్కే అవకాశం లేదని తాజా సమాచారం. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణం లో రూపొందిన వకీల్ సాబ్, వి సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. కాని ఆ సినిమాలు రిలీజ్ ఎప్పుడవుతాయో ఇంకా అర్థం కాని పరిస్థితి. దాంతో అనిల్ రావిపూడి ఎఫ్ 3 కి ముహూర్తం ఇప్పట్లో కుదరనట్టే అంటున్నారు. మొత్తానికి ఈ సమస్యని అనిల్ రావిపూడి ఎలా తట్టుకుంటాడో చూడాలి మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: