మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన బుచ్చిబాబు డైరక్షన్ లో ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. లాక్ డౌన్ లేకపోతే ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఉప్పెన. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమా నుండి రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. 


అందులో నీ కన్ను నీలి సముద్రం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. రిలీజ్ ముందే ఉప్పెన సాంగ్ కు ఈ రికార్డ్ వ్యూస్ రావడం చూస్తుంటే మెగా మేనళ్లుడు అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు. ఇప్పటికే అన్న సాయి తేజ్ సూపర్ సక్సెస్ కెరియర్ తో దూసుకెళ్తుండగా ఇప్పుడు అదే బాటలో తమ్ముడు తన సత్తా చాటాలని చూస్తున్నాడు. 


ఉప్పెనలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే సినిమాలో విలన్ గా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో చిన్న పాత్రలో మెప్పించిన విజయ్ సేతుపతి తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి పాత్ర కూడా సినిమాకు హైలెట్ అంటున్నారు. మరి మెగా మేనళ్లుడు సినిమా సాంగ్స్ తో సూపర్ హిట్ కాగా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 


ఈ సినిమాకు సుకుమార్ బ్యాక్ సపోర్ట్ గా ఉన్నారు, నిర్మాణంలో భాగమవడమే కాదు ఎడిటింగ్ కూడా తానే చూస్తున్నట్టు టాక్. మొత్తానికి సుకుమార్ చేతుల మీదగా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ అదిరిపోబోతుందన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: