ప్రస్తుతం తెలుగు చిత్ర చిత్ర పరిశ్రమలోని ప్రేక్షకులందరూ తమ అభిమాన హీరోల  సినిమా కోసం ఎంతో నిరీక్షణగా  ఎదురుచూస్తున్నారు. అయితే కనీసం ప్రస్తుతం తమ అభిమాన హీరో కి సంబంధించిన ఎలాంటి సినిమా అప్ డేట్స్ గాని... లేదా సినిమా విడుదల కాని లేక పోవడంతో తెలుగు ప్రేక్షకులు నిరీక్షణ మరింతగా పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ లు అన్ని నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఈ లాక్ డౌన్  సమయాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఉంటూ ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాడు. 

 

 

 అయితే ప్రస్తుతం మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ గీతగోవిందం ఫేమ్  పరశురామ్ తో సైన్ చేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ పరుశురాం ఆల్రెడీ దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు. ఇది మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్క బోతుంది అంటూ తెలిపారు. ఇక లాక్ డౌన్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన చిత్రీకరణ మొదలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు మరోసారి పరశురామ్ సినిమాలో స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

 

 

 సరిలేరు నీకెవ్వరు కు ముందు మహర్షి సినిమాలో  స్టూడెంటుగా నటించి తన గెటప్  మొత్తం మార్చుకొని ప్రేక్షకులను  అలరించి మంచి విజయాన్ని అందుకున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం పరశురామ్ సినిమాలో ఒక కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ మహేష్ బాబు కోసం ప్లాన్ చేస్తున్నట్లు  సమాచారం. దీంతో మరోసారి మహేష్ బాబు స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నాడని చర్చ మొదలైంది. ఇక అన్నీ సవ్యంగా జరిగితే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై ఇప్పటివరకు ఓ క్లారిటీ రాలేదు. ఈ నెల చివరిలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని వివరాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: