తెలుగు సినిమా ను మార్చేసిన చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ఏ స్థాయికి తీసుకుని వెళ్ళింది అనేది అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రెండు భాగాలు కూడా ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చాయి. మొదటి భాగం లో  అంతగా కొన్ని సన్నివేశాలు లేకపోయినా ఫైట్ సన్నివేశం టాలీవుడ్ లో ఒక సంచలనం. ఇక రెండో భాగం విషయానికి వస్తే రెండో భాగం లో కూడా ప్రేక్షకులకు బాగా నచ్చిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటీ అంటే కట్టప్ప బాహుబలి ని చంపడం. 

 

ఈ సన్నివేశం గురించి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రస్తావించారు అప్పట్లో. చాలా మంది ఈ సన్నివేశ౦ గురించి ఎంతగానో చర్చించారు. ఆ సినిమాలో నమ్మకంగా ఉన్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఎవరికి అర్ధం కాలేదు. ఆ సన్నివేశం చుట్టూనే సినిమా అంతా తిరిగింది. ఆ సన్నివేశం లో ప్రభాస్ నటన సత్య రాజ్ నటన అన్నీ కూడా ప్రేక్షకులను బాగా మెప్పించాయి అనే సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆ సన్నివేశం చచ్చిపోయినా ఆ సినిమా ను చూడటానికి ప్రేక్షకులకు థియేటర్ కి వెళ్ళడానికి మాత్రం ఆ సన్నివేశం చాలా బాగా ఉపయోగపడింది. 

 

ఆ సన్నివేశం గురించి ఎంతో ఆసక్తి ఎన్నో ప్రశ్నలు కూడా వినిపించాయి. దాని మీద క్విజ్ ప్రోగ్రాం లు కూడా నిర్వహించారు. ఎవరు చూసినా సరే ఆ సన్నివేశం గురించి మాట్లాడుకోవడమే అనే విధంగా ఆ సినిమా ఉంది అనేది వాస్తవం. అలా ఆ సినిమా సస్పెన్స్ బాగా బాగా తీసుకుని ప్రేక్షకులకు అందించింది. ఆ సినిమా వసూళ్లు కూడా బాలీవుడ్ సినిమాలు అందుకోలేని విధంగా వెళ్ళాయి  అనేది తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: