హీరోలు దర్శకులు సంగీత దర్శకులకి ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ లకైతే ఈ అభిమానుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నప్పటికీ తమదైన మ్యూజిక్ ద్వారా సినిమాకు ప్లస్ పాయింట్ గా మారి పోతూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్లు . అందుకే ప్రస్తుత కాలంలో దర్శకులు సినిమాకు వెన్నుముక్కల మారిపోయారు. నేపథ్య సంగీతం అందించాలి అన్న, అదిరిపోయే క్లాసికల్ మెలోడీ సాంగ్స్ తో  అదరగొట్టాలన్న ... హీరో హీరోయిన్లకు సరిపడ పాటలను కంపోజ్ చేయాలన్నా అది మ్యూజిక్ డైరెక్టర్ కి సాధ్యం . 

 

 అయితే మామూలుగా సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోలు మ్యూజిక్ డైరెక్టర్లు దర్శకులను కలపడానికి నెటిజన్లు కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా తమ అభిమాన వ్యక్తుల దృష్టిలో పడాలి అనుకుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఓ నెటిజన్ టాలీవుడ్  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసి విజయం సాధించాడు. నెటిజన్లు ఎన్నో కొటేషన్ లు పెడుతూ ట్విట్టర్లో తమ అభిమాన వ్యక్తుల పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు. 

 

 ఇలాగే ఇప్పుడు ఒక వ్యక్తి అలాంటి కొటేషన్ పోస్ట్  చేశాడు.. తిరుపతి లడ్డు.. అన్నవరం ప్రసాదం.. దేవిశ్రీప్రసాద్ పాటలు ఎప్పుడు బోర్ కొట్టవు అంటూ ఒక ట్విట్ పెట్టగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది వైరల్  ఏకంగా దేవిశ్రీప్రసాద్ వరకు వెళ్ళింది.దీంతో ఈ ట్వీట్ పై స్పందించిన దేవి శ్రీ ప్రసాద్  థ్యాంక్స్ చెబుతూ ఉన్నట్లుగా కొన్ని సింబల్స్ పెడితూ  రిప్లై ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఓ ట్విట్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: