పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న డైరక్టర్ అనీల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా ఎఫ్-3 చేస్తాడని తెలుస్తుంది. ఈ లాక్ డౌన్ టైం లో సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసిన అనీల్ రావిపూడి ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మొన్నటిదాకా ఈ సీక్వల్ లో ఇద్దరు హీరోలు మాత్రమే ఉంటారని అనుకోగా.. లేటెస్ట్ గా సినిమాలో మూడవ హీరో కూడా ఉంటారని అంటున్నారు. 

 

వరుణ్ తేజ్, వెంకటేష్ లతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ సినిమాలో నటిస్తాడని తెలుస్తుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు ఇద్దరు హీరోలో ఉంటారట కానీ సెకండ్ హాఫ్ లో మూడవ హీరో గెస్ట్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. సినిమాలో మహేష్ బాబు కూడా ఉంటాడని తెలుస్తుంది. మహేష్ పాత్ర సర్ ప్రయిజ్ గా ఉంటుందని అంటున్నారు. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న అనీల్ రావిపూడి ఈసారి ఎఫ్-3తో అదిరిపోయే స్కెచ్ వేశాడని తెలుస్తుంది. సినిమా తప్పకుండా మరో సెన్సేషనల్ హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు. 

 

ఇప్పటికే వెంకటేష్, వరుణ్ తేజ్, వెంకటేష్, మహేష్ కలిసి మల్టీస్టారర్ తీశారు. అయితే ఈ ముగ్గురు కలిసి చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ ఇవ్వగా అనిల్ రావిపూడి సినిమా అనగానే మహేష్ గెస్ట్ రోల్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఎఫ్-3 2021 సంక్రాంతి రిలీజ్ అంటున్నారు. అయితే ఆ టైం కు ట్రిపుల్ ఆర్ వస్తే మాత్రం రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది.                      

 

మరింత సమాచారం తెలుసుకోండి: