దగ్గుబాటి ఫ్యామిలిలీ నుండి వచ్చిన మూడవ తరం వారసుడు దగ్గుబాటి రానా, ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నటుడిగా ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ ని దక్కించుకున్న రానా, ఆ సినిమా ద్వారా ప్రేక్షకుల నుండి మంచి పేరును కూడా దక్కించుకున్నారు. ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించిన రానాకు, ఆ తరువాత దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తన బాహుబలి సినిమాల్లో విలన్ గా భల్లాలదేవుడు పాత్ర పోషించేందుకు ఛాన్స్ ఇచ్చారు. కాగా ఎంతో భారీ విజయాలు అందుకుని ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని విపరీతంగా పెంచిన బాహుబలి రెండు భాగాల్లో కూడా రానా ప్రతినాయకుడి పాత్రలో తన అద్భుత నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. 

 

ఇక ఆ తరువాత నుండి మంచి, గుర్తింపు సంపాదించిన రానా, అనంతరం తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో హీరోగా నటించి మరొక హిట్ కొట్టాడు. ప్రస్తుతం అరణ్య, విరాట పర్వం సినిమాల్లో నటిస్తున్న రానా, నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి మొదటి నుండి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేసుకునే అలవాటున్న రానా, నేడు తన లవర్ తన లవ్ ని యాక్సెప్ట్ చేసిందంటూ ఆమెతో దిగిన ఫోటోని పోస్ట్ చేసారు. ఆమె మరెవరో కాదు, డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే ప్రముఖ ఈవెంట్ మానేజ్మెంట్ కంపెనీ ఫౌండర్ అయిన మిహీక బజాజ్. కొన్నాళ్లుగా రానా ఆమెతో ప్రేమలో ఉన్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. 

 

ఇక నేడు ఆమె తన లవ్ ని ఒప్పుకోవడంతో తనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన రానా, అతి త్వరలో ఆమెను వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య మంచి సయోధ్య కుదిరిందని, ప్రస్తుతం కొన్నాళ్లుగా మన దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో ఇది ముగియగానే అతి త్వరలో మంచి ముహూర్తం చూసి వారిద్దరికీ ఘనంగా పెళ్లి చేయాలని నిశ్చయించారట. ఇక రానా తన లవర్ మిహీక తో దిగిన ఫోటోని పోస్ట్ చేయగానే హీరోయిన్స్ శృతిహాసన్, హన్సిక, సమంత అక్కినేని తదితరులు అతడికి కంగ్రాట్స్ చెపుతూ రీట్వీట్స్ చేయడం జరిగింది. కాగా రానా పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: