టాలీవుడ్ సింగర్స్ లో ఎన్నో హిట్ పాటలు పాడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్స్ లో సమీరా భరద్వాజ్ ఒకరు. 'చంపేశావే నన్ను', ‘మధురమే ఈక్షణమే చెలి’. ‘తెలుసా.. తెలుసా ప్రేమించానని’ పాటలు సమీరా భరద్వాజ్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ కొన్ని నెలల క్రితం బాలయ్య ఫ్యాన్స్ సింగర్ సమీరాను టార్గెట్ చేశారు. సమీరా అనుకోకుండా చేసిన చిన్న పొరపాటు వల్ల ఆమెను బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎటాక్ చేశారు. 
 
తాజాగా ఈ ఘటనకు సంబంధించిన విశేషాలను సమీరా తెలియజేశారు. తనకు డబ్ స్మాష్ యాప్ వల్ల బాలయ్య ఫ్యాన్స్ తో ఇష్యూ మొదలైందని చెప్పుకొచ్చారు. అప్పట్లో డబ్ స్మాష్ యాప్ అందరూ వాడుతున్నారని... తాను కూడా వాడానని బాలకృష్ణ గారి డైలాగ్ తో మొదటి వీడియో చేశానని చెప్పుకొచ్చారు. నిజానికి ఆ వీడియో పోస్ట్ చేస్తే ఏమవుతుందో తాను ఆలోచించలేదని... అనంతరం స్నేహితులు ఫోన్ చేసి వాట్సాప్ లో ఒక వీడియో వైరల్ అవుతుందని చెప్పుకొచ్చారు. 
 
ఆ వీడియోలో బాలకృష్ణ ఫ్యాన్స్ సింగర్ వి సింగర్ లా ఉండమని బెదిరించారని... తిడుతూ చాలా మంది ట్రోల్ చేశారని అన్నారు. ఆ తరువాత వెంటనే డబ్ స్మాష్ వీడియో డిలేట్ చేశానని... కానీ అప్పటికే ఆ వీడియోను ఎవరో యూట్యూబ్ లో పోస్ట్ చేశారని చెప్పారు. ఆ తరువాత తాను కూడా బాలకృష్ణ ఫ్యాన్ నే అని అభిమానులకు సారీ చెబుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశానని అన్నారు. 
 
ఆ తర్వాత బాలయ్య ఫ్యాన్స్ శాంతించారని... అలాంటి తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డానని అన్నారు. ఆ తరువాత బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమాలో ఒక పాట కూడా పాడానని అన్నారు. మెలోడీ గీతాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సమీరా తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. చిన్న వయస్సు నుండే సంగీతంను ఎంతో అభిమానించిన పాడుతా తీయగా, సూపర్ సింగర్ ప్రోగ్రామ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని సింగర్ గా ఎదిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: