ఇప్పుడు మన తెలుగులో కొందరు హీరోలు ఎక్కువగా బయోపిక్ సినిమాల మీద దృష్టి పెట్టారు నే సంగతి తెలిసిందే. ఆ సినిమాలకు మంచి ఆదరణ ఉన్న నేపధ్యంలో స్టార్ హీరోలు దర్శకులు అందరూ కూడా ఇప్పుడు ఆ సినిమాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. మహానటి సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆ రేంజ్ లో బయోపిక్ రాలేదు. ఆ సినిమా తర్వాత మన హీరో లు ప్రయత్నాలు చేసినా సరే... ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఒక్క సినిమాను కూడా తీసుకుని రాలేదు అనేది వాస్తవం. 

 

ఇప్పుడు మళ్ళీ మన తెలుగులో బయోపిక్ లను తీసుకుని రావడానికి గానూ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పుడు శోభన్ బాబు బయోపిక్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సుమంత్ హీరో గా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రేక్షకులు అంటున్నారు. సుమంత్సినిమా ద్వారా శోభన్ బాబు లా ప్రేక్షకులను మెప్పించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం చాలా మంది ఆ తరం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాని ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకు రాలేదు. 

 

ఆయన జీవితంలో ఎక్కువగా కొన్ని కష్టాలు కనపడుతూ ఉంటాయి. జయలలిత ఆయన జీవితంలోకి వచ్చిన విధానం కూడా ప్రేక్షకులకు  ఆసక్తిని ఇచ్చే విధంగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరూ విడిపోయిన విధానం కూడా ప్రేక్షకులకు బాగా వినోదాన్ని ఇస్తుంది అని పెళ్లి అయినా సరే ఆయన ఆమెకు ఏ విధంగా దగ్గర అయ్యారు అనేది చాలా మందికి అర్ధం కాలేదు. దీని తో ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉందని ప్రేక్షకులు అంటున్నారు. మరి ఈ సినిమాను తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: