టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కొత్త హీరో, హీరోయిన్ లతో పాటు దర్శక, నిర్మాతలు కూడా కొత్త వారు పరిచయ మౌతున్నారు.  అయితే వీరిలో కొంతమంది అగ్ర దర్శకులతో పోటీ పడుతూ తమ సత్తా చాటుతున్నారు. అయితే వీరిలో ప్రశాంత్ నీల్ ఒకరు. కేజిఎఫ్ సినిమాతో టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించారు. అయితే ఈ సినిమా ని పాన్ ఇండియా సినిమాగా ఒకేసారి అయిదు భాషల్లో విడుదల చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన కేజిఎఫ్ సినిమా సీక్వెల్ ని కేజిఎఫ్ 2 ని తెర పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు.

 

టాలీవుడ్ లో ఎన్టిఆర్, ప్రశాంత్ నీల్ సినిమా గురించి కొద్ది రోజులుగా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ ప్రశాంత్ నీల్ తెలిపిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి కేజిఎఫ్ 2 పైనే తన దృష్టి అంతా ఉందని, ఈ సమయంలో వేరే సినిమా గురించి ఆలోచిస్తే ఈ సినిమా ఇన్పుట్ సరిగా రాదని తెలియ చేసారు. ఈ సినిమా పూర్తి అయ్యే వరకు ఏ సినిమా పై ఫోకస్ పెట్టలేనని, నెక్స్ట్ మూవీ గురించి ఎటువంటి స్క్రిప్ట్ రెడీ చేయలేదని తెలుస్తుంది. 

 

అయితే ఈ వార్త ఎన్టిఆర్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్ళు చల్లినట్టు అయ్యింది. ఎన్టిఆర్ ప్రస్తుతం త్రిపులార్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తారని, దాని తర్వాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ఉంటుందని, ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుందని, ఈ సినిమాతో తారక్ నేషనల్ స్టార్ గా చేయాలని ప్రశాంత్ ప్లాన్ చేసాడని గత కొద్ది రోజులుగా పుకార్లు వస్తున్నాయి. అయితే  వీటన్నిటిని ప్రశాంత్ నీల్ ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: