మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఏ హీరో అయినా తమకంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ ని క్రియోట్ చేసుకోవాల్సిందే. అంతగా ఈ హీరోలు హార్డ్ వర్క్ చేసి ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ కి వస్తారు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి నుంచి సాయి ధరం తేజ్ వరకు ఎవరిని చూసిన అర్థమవుతుంది. ఒక సినిమా ఒప్పుకుంటే ఆ సినిమాలో పాత్ర కోసం ప్రాణం పెడతారు. అందుకే మెగా హీరోలకి ఫ్యాన్స్ లో అసాధారణమైన క్రేజ్ నెలకొంటుంది. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వస్తున్నా వాళ్ళ ఇమేజ్ ని మరెవరూ సొంతం చేసుకోలేరు. ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ లోను అదే ఆసక్తి నెలకొంది. 

 

వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం "ఉప్పెన". ఈ సినిమా నుండి మార్చి 2న రిలీజ్ అయిన "నీ కన్ను నీలి సముద్రం"… అనే లిరికల్ వీడియో సాంగ్ సంచలనం సృష్ఠిస్తోంది. కేవలం మ్యూజిక్ లవర్స్ నే కాదు కామన్ ఆడియన్స్ ని ఈ సాంగ్ కి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా యూత్ కైతే ఈ సాంగ్ లో తమని తాము ఊహించుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకూ 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది.  

 

దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కి జావేద్ ఆలీ పాడిన విధానం.. శ్రీమణి సాహిత్యం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఉప్పెన సినిమా రిలీజ్ కాక ముందే ఈ సాంగ్ భారీ అంచనాలను పెంచేసింది. బుచ్చిబాబు సానా దర్శకుడిగా, వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

 

అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గతంలో సుకుమార్ నుంచి వచ్చిన కుమారి 21 ఎఫ్ ఎంతటి సెన్షేషన్ ని క్రియోట్ చేసిందో అంతటి సెన్షేషన్ ని మళ్ళీ ఉప్పెన చేయడం ఖాయంటూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఈ మెగా హీరో మొదటి సినిమాతోనే రికార్డ్ సాధించబోతున్నాడనమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: