ఇప్పుడు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హాట్ టాపిక్. ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు.  తన కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా ఆయన సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన  ఇప్పుడు ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన లూసిఫర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మలయాళం రీమేక్. మలయాళం రీమేక్ సినిమా గా వస్తున్న ఈ సినిమా హక్కులను రామ్ చరణ్ ఎప్పుడో కొనుగోలు చేసారు కూడా. 

 

ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి ఇప్పుడు చిరంజీవి ఎక్కువగా ఫోకస్ చేస్తున్న కథలు రీమేక్. ఎందుకు అంటే ఆయన సొంత కథలతో ఇప్పుడు సినిమాలు చేయడానికి భయపడే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. ఆయన నటించిన సైరా సినిమా ఆయన కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా నుంచి ఆయన చాలా నేర్చుకున్నారు అనేది కూడా వాస్తవం. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమా వచ్చే ఏడాది వస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాను వాయిదా వేసారు.


 
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా మిగిలిన షూటింగ్ ని వాయిదా వేసారు. ప్రస్తుతం చిరంజీవి తన తర్వాతి సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. వయసు కి తగిన పాత్రలను చెయ్యాలని ఇప్పుడు ప్రయోగాలు అవసరం లేదనే భావన లో ఆయన ఉన్నారు అని టాక్. రామ్ చరణ్ కూడా ఇప్పుడు తన తండ్రి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ చరణ్  ఎవరికి అవకాశం కూడా ఇవ్వకుండా తండ్రి సినిమాలను నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: