పాత రోజుల్లో నాటకాలు, కొన్ని రోజుల క్రితం వరకు సినిమాలు, ప్రస్తుతం వెబ్ సిరీస్లు. ఇక రాబోయే రోజులలో వెబ్ సిరీస్ లో హవా నడుస్తుంది.. బడా నిర్మాతలు, నిర్మాణ సంస్థలు భావిస్తున్నారు. దీనితో ఇప్పటికే పలువురు డిజిటల్ రంగంలోకి ప్రవేశం అయ్యారు. ఇక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ అయిన ఆహా... క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించు కుంటున్నాడు. అలాగే శరత్ మరార్, స్వప్న దత్, క్రిష్ లాంటి వాళ్లు కూడా డిజిటల్ ఫ్లాట్ లో అడుగు పెట్టారు. 

 


ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా వెబ్ కంటెంట్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా సినీ తారలు కూడా వెబ్ సిరీస్ లో నటించేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక మన తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే.. ఇప్పటికే శ్రీకాంత్ జగపతి బాబు సందీప్ కిషన్ అల్లు శిరీష్, నవదీప్ లాంటి హీరోలు వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు కూడా అందరూ సినిమాలకంటే వెబ్ సిరీస్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరోయిన్ల విషయానికి వస్తే.. ఇప్పటికే ప్రియమణి, సమంత, కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ కూడా డిజిటల్ ఫామ్ లోకి అడుగు వేశారు. 

 


ఇక ఈ తరుణంలో ఇటీవల మెగాస్టార్ చిరు ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని స్వయంగా చిరునే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. ఈ వెబ్ సిరీస్ కి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారు అన్న విషయానికి వస్తే ... మెగా డాటర్ సుష్మిత దర్శకత్వం చేయబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో మారు మోగాయి. ఇక ఇప్పటికే సుష్మిత మెగా హీరోల సినిమాలు అన్నిటికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ ఉంది. ఈ తరుణంలోనే తన తండ్రి డిజిటల్ డెబ్యూ కోసం.. కూతురు డైరెక్టర్ గా వహిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం చిరు లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసి మరో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: