తెలుగు చిత్ర పరిశ్రమలో బాపు బొమ్మగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్ ఎవరూ అంటే టక్కున గుర్తొచ్చే పేరు స్నేహ. ఇంతకీ ఈ అమ్మడికి బాపుబొమ్మ పేరు ఎలా వచ్చింది అంటే ఈ అమ్మడు బాబు దర్శకత్వంలో తెరకెక్కిన రాధాగోపాలం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్గా కొన్ని ఏళ్లపాటు కొనసాగింది. తనదైన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించింది స్నేహ. కేవలం తెలుగులోనే కాదు తమిళ కన్నడ భాషల్లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
అయితే స్నేహ తన కెరియర్ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే తమిళ హీరో ప్రసన్న ని వివాహం చేసుకుంది స్నేహ. అయితే తమిళంలో ఓ చిత్రం సమయంలో వీరిద్దరు హీరో హీరోయిన్లుగా నటించిన సమయంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టి... ఆ తర్వాత అది పెళ్లి వరకు వెళ్ళింది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం తెలిసిందే . అయితే తాజాగా ప్రసన్న స్నేహ జంట కి సంబంధించిన వెడ్డింగ్ యూనివర్సిటీ కి సంబంధించిన ఫోటోలు తాజాగా ప్రసన్న సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి..
మరోవైపు స్నేహ కూడా తన ఎనిమిదేళ్ల జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేసింది. దీంతో వీరి ఫోటోలు చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇక ఇద్దరి ప్రేమకు గుర్తుగా విహాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇక ఈ ఏడాది జనవరి 24న ఇద్దరికీ ఆడపిల్ల జన్మించింది.అయితే పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చింది స్నేహ. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కాస్త వదిన అక్క, వదిన పాత్రలకు పరిమితం అయిపోయింది. రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ కు వదిన పాత్రలో నటించింది స్నేహ.
View this post on InstagramIts been a fantastic 8 years and more of love n togetherness with @realactress_sneha ❤❤ have always felt the blessing. And looking forward to all your wishes for better future🙏🙏😍 all of you stay safe!!
View this post on InstagramIt was crazy journey n this will continue to make more beautiful memories #anniversary #crazydays #foreverlove #crazycouples 😍😍😍😍😍💝💝💝🥰🥰🥰🥰 @prasanna_actor