లాక్ డౌన్ మరి కొంతకాలం ఈ దేశంలో కొనసాగుతుంది. ఆ తరువాత పరిణామాలు చూసినా  కూడా త్వరగా  సాధారణ స్థితికి వస్తాయని ఎవరూ అనుకోవడం లేదు. అసలు పూర్వం రోజులు మళ్ళీ వస్తాయా అన్న డౌట్లు కూడా ఎక్కువగా  ఉన్నాయి. ఇక సినిమా రంగం అయితే కొన్నాళ్ళ పాటు తెర మూసుకుని కూర్చోవాల్సిందేనని డిసైడ్ అయిపోయింది.

 

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్స్ గా ఉన్న వారు లాక్ డౌన్ పీరియడ్ పేరిట వచ్చిన హాలీడేస్ ని  చెడగొట్టుకుంటున్నారని అంటున్నారు. ఎటూ షూటింగులు లేవు. పెళ్ళిళ్ళు అయితే ఇంట్లో బెటర్ హాఫ్ తో హాయిగా ఉండొచ్చు. పైగా ఎటువంటి టెన్షన్లు లేని లైఫ్ కొన్నాళ్ళ పాటు అయినా ఎంజాయ్ చేయవచ్చు. ఇదే ఆలోచనతో ఇపుడు   యంగ్ హీరో నిఖిల్ అర్జంట్ గా పెళ్ళికి రెడీ అయిపోతున్నాడు. నిఖిల్ పెళ్ళి ఆయన ప్రేమించిన డాక్టర్  పల్లవీ వర్మతో రేపు ఆయన ఫాం హౌస్ లో జరుగుతోంది.

 

రెండు వైపుల నుంచి అతి తక్కువ మందితో జరిగే ఈ పెళ్ళి కేవలం ఇద్దరు కలిసేందుకేనన్న నిజాన్ని నిఖిల్ త్వరగా  తెలుసుకుని క్విక్ డెసిషన్ తీసుకున్నాడని అంటున్నారు. నిజానికి ఏప్రిల్ నెలలో నిఖిల్ పెళ్ళికి ముహూర్తం పెట్టారు. కానీ కరోనా, లాక్ డౌన్ వల్ల అది క్యాన్సిల్ అయింది. ఇక దగ్గరలో ముహూర్తాలు లేకపోవడం, లాక్ డౌన్ కూడా కంటిన్యూ అవడంతో నిఖిల్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

 

రెండు హ్రుదయాలు మూడు ముళ్ళతో కలవడానికి ఇంత హడావుడి అవసరం కూడా లేదు. పైగా లాక్ డౌన్ పీరియడ్ మరి కొంతకాలం పొడిగించినా ఇబ్బంది కూడా లేదు. ఎటూ షూటింగులు ఉండవు. ఇపుడు నిఖిల్ వేసిన అడుగుతో మరింతమంది హీరోలు క్విక్ డెసిషన్ తీసుకుంటే బెటరేమో. ఎందుకంటే ఈ నెల 30 తో ముహూర్తాలు ఉండవు. ఆ తరువాత కొన్ని నెలల పాటు పెళ్ళి ఊసే ఉండదు.

 

ఇక లాక్ డౌన్ తరువాత షూటింగులు మొదలైతే పళ్ళి కూడా ఒక మొక్కుబడి అవుతుంది. హీరోలకు స్వీట్ హోమ్ లో  ఎంజాయి చేయడానికి అసలు  టైం ఉండదు. సో టాలీవుడ్ బ్యాచలర్స్ కి నిఖిల్ రూట్ చూపించాడు. ఇక ఎంత మంది నడుస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: