స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్నని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. 


మాములుగా సుకుమార్ సినిమా అంటే తన టీమ్ లో పెద్దగా మార్పులు ఉండవు. కానీ పుష్ప సినిమాకు మాత్రం సుకుమార్ కొన్ని మార్పులు చేస్తున్నారని తెలుస్తుంది. సుక్కు సినిమా అంటే డీఓపీగా రత్నవేలు, మ్యూజిక్ డైరక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ కన్ఫర్మ్ అన్నట్టే. కానీ ఈసారి వాళ్ళిద్దరితో రత్నవేలు ఈ సినిమా చేయట్లేదని తెలుస్తుంది. వేరే ప్రాజెక్టులు ఉండటం వల్ల రత్నవేలు పుష్ప నుండిబయటకు వెళ్తున్నారట. ఇక ఆయన ప్లేస్ లో నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు కెమెరా మెన్ గా పనిచేసిన మీరోసాలా కూబా బ్రోజెక్ ను ఎంపిక చేశారట. 


నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో అతని పనితనం చూసి సుకుమార్ అతన్ని పుష్ప లాంటి క్రేజీ ప్రాజెక్టుకు తీసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ పుష్పతో కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాతో తన సత్తా చాటాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ రంగస్థలంతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ఈసారి బన్నీకి పుష్ప రూపంలో హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా అంచనాలకు తగినట్టు ఉంటుందో లేదో చూడాలి. సినిమా కోసం బన్నీ ఇప్పటికే లుక్ మార్చేశాడు. యాస కూడా నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: