కీర్తి సురేష్ పేరు వినగానే మనకు 'మహానటి' సినిమా గుర్తుకు వస్తుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆరాధించే నటి సావిత్రి బయోపిక్‌లో కీర్తి సురేష్ జీవించేసింది. మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో ప్రాణం పోసి విమ‌ర్శ‌కులే కాదు సినీ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న మహానటి కీర్తి సురేష్ సినీ ఇండస్ట్రీలోకి ఒకప్పటి నటి మేనక కూతురుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది. 'పైలట్స్' అనే మలయాళ చిత్రంలో అనే బాలనటిగా కనిపించింది.  ఆ తరువాత బాలనటిగా కొన్ని సినిమాలు చేసింది.

 

ఇక తెలుగులో రామ్ హీరోగా నటించిన 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన 'నేను లోకల్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. తమిళ్ లో పెద్ద పెద్ద స్టార్లతో నటించిన కీర్తి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి' చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా పరాజయం పాలైంది. దీంతో తెలుగులో స్టార్ హీరోల పక్కన ఛాన్సెస్ రాలేదు. 'మహానటి' లాంటి సినిమాలు వస్తున్నప్పటికీ స్టార్ హీరోలతో నటించే అవకాశం మాత్రం రాలేదని చెప్పవచ్చు. ఇతర ఇండస్ట్రీలలో మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని తన హవా కొనసాగిస్తూ వస్తోంది.

 

అయితే అలా కొన్నాళ్ల తర్వాత అకస్మాత్తుగా కీర్తి బరువు తగ్గడం స్టార్ట్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనితో ఓ మీడియా వారు కీర్తి ఎక్స్ పోజింగ్ చేసేందుకే సన్నబడింది అని పలు రకాల కథనాలు వెలుబుచ్చారు. ఈ కథనాలపై కీర్తి ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా కాస్త ఘాటుగానే తన స్పందనను తెలియజేసారు. తనపై వచ్చిన ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని కొట్టిపారేశారు. తాను బరువు తగ్గింది సినిమాలలో నాజూగ్గా కనిపించడానికి తప్ప అలంటి రోల్స్ లో కనిపించడానికి కాదు అన్ని తనపై వచ్చిన రూమర్ కు చెక్ చెప్పేసారు. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాతే' చిత్రంలోను.. కార్తీక్ సుబ్బరాజు 'పెంగ్విన్', మోహన్‌లాల్ నటిస్తున్న 'మరక్కార్ అరబికదలింటే సింహం' సినిమాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో 'మిస్ ఇండియా' 'గుడ్ లక్ సఖీ' 'రంగ్ దే' చిత్రాల్లో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: