టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ అంతా, ఇంతా కాదు. కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న చిరు కొద్ది రోజులు విరామం తీసుకుని తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినా కూడా  చిరంజీవిలో అంతకు ముందు ఉన్న జోష్, నటన, డ్యాన్స్ మీద ఉన్న పట్టు ఆయన్ని ఈ తరం హీరోలకు గట్టి పోటి ఇచ్చేలా చేస్తున్నాయి అనే చెప్పాలి. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

 

 వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వర్గాల అభిమానులను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో కూడా హుషారుగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే కొరటాల తో చేస్తున్న ఆచార్య సినిమాలో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరుకి జోడిగా త్రిష ని సంప్రదించగా ఆమె నో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని చిరంజీవి త్రిషకి చేసిన సోషల్ మీడియా పోస్ట్  ద్వారా వెల్లడైంది. 

 

అయితే ఆచార్య సినిమా నుండి తప్పుకోవడానికి కారణం త్రిషకు డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడమే అని క్లారిటి వచ్చింది. ఇప్పుడు తాజాగా చిరు చేస్తున్న సినిమాల్లో త్రిష కనిపించనుంది అనే వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఆచార్య తర్వాత వస్తున్న లుసిఫర్ రీమేక్ లో త్రిష ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాల కథనం. ఒక వేళ ఆ సినిమా కాక పోయినా తర్వాత బాబి లేదా మెహర్ రమేష్ సినిమాల్లో అయినా త్రిషని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఆచార్య సినిమాకు నో చెప్పినందుకు త్రిషపై మెగా అభిమానులు కోపంగా ఉన్నారు. అందుకే వీరి కాంభో పై అంత ఆసక్తి చూపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: