కీర్తి సురేష్. ఈ అమ్మడు అందరికీ తెలిసింది మహానటి మూవీ ద్వారా. ఆ మూవీ మహానటి, కళామతల్లి ముద్దు బిడ్డ సావిత్రి జీవిత చరిత్ర. తెలుగు సినిమా రంగంలో సావిత్రి అంటే ఎంతో గౌరవం, మర్యాదా ఉన్నాయి. ఆమెను స్పూర్తిగా  తీసుకుని ఎంతో మంది  ఉత్తమ స్థాయి కధానాయికలుగా ఎదిగారు. అటువంటి మహానటి పాత్ర వేసిన తరువాత కీరి సురేష్ కీర్తి అమాంతం బాగా పెరిగిపోయింది.

 

అంతకు ముందు ఆమె గ్లామ‌ర్ షో పెద్దగా చేయలేదు కానీ కొంతవరకూ అందాల బొమ్మగా కనిపించింది. ఎపుడైతే ఈ పాత్ర వేసిందో కానీ కీర్తి ఈ కొత్త ఇమేజ్, ఓ విధంగా చెప్పాలంటే గొప్ప ఇమేజ్ ని కాపాడుకోవడానికి గట్టిగానే క్రుషి చేస్తోంది. ఈ ఇమేజ్ కి దగ్గరా ఉన్న పాత్రలు చేయాలని కూడా నిర్ణయించుకుంది. ఈ మధ్యలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా కీర్తి చేస్తోంది. అయితే ఆమె ఇపుడు మిస్ ఇండియా అనే  మూవీలో చేస్తోంది.

 

ఈ మూవీలో కీర్తి బికినీ డ్రెస్ తో షో చేస్తుందని సోషల్ మీడియాలో ఒకటే వైరల్ అవుతోంది. దాంతో కీర్తి ఈ టార్చర్ తట్టుకోలేక తానే స్వయంగా వివరణ ఇవ్వాల్సివచ్చిందట. తాను అటువంటి పాత్ర చేయడంలేదని, గ్లామర్ షోని అసలు చేయడంలేదని కూడా చెప్పేసి కీర్తి గట్టి క్లారిఫికేషన్ ఇచ్చేసింది.

 

పైగా కీర్తి ఇలాంటి ప్రచారాల మీద కూడా తెగ చికాకు పడుతోంది. అంతకు ముంది తన వ్యక్తిగత జీవితాన్ని, ప్రేమను గురించి కూడా అసత్య‌ వార్తలు ప్రచారం చేశారని కూడా కీర్తి మండిపడుతోంది. ఎందుకిలా చేస్తారంటూ రుసరుసలాడుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే కీర్తిని మహానటిగా చూసిన జనం ముందు చిన్న పాపను చేసి పొట్టి పొట్టి డ్రెస్ లతో చూపించాలన్న కొంత మంది అతి ఉత్సాహం మీద కూడా కీర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటివి కట్టిపెట్టండని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. ఇకనైనా ఆగుతారా.

మరింత సమాచారం తెలుసుకోండి: