గత రెండు నెలల క్రితం వరకు టాలీవుడ్ లో తెరకెక్కే చాలా సినిమాలు షూటింగ్స్ కి చక చకా విదేశాలకి వెళ్ళేవాళ్ళు. కనీసం ఒక్క సాంగ్ కోసమైనా ఏదో ఒక ఫారిన్ లొకేషన్ కి యూనిట్ వెళ్ళి రావడం మనకి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి దెబ్బతో ప్రపంచం మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలకి ఇప్పట్లో కోలుకోలి దెబ్బ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి విధించిన లాక్ డౌన్ కారణంగా 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన పనులన్ని ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ పరిస్థితుల కారణంగా విదేశాలలో షూటింగ్స్ ఇప్పట్లో వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా లేనట్టేనని టాల్లీవుడ్ లో చర్చించుకుంటున్నారు. 

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ -పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా కొంత వరకు టాకీ పార్ట్ జరుపుకుంది. అది కూడా ముంబై పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగింది. ముఖ్యంగా ధారవి లో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. అంతేకాదు బ్యాంకాక్ లోను టాకీ పార్ట్ అండ్ సాంగ్స్ ప్లాన్ చేశారు పూరి. అయితే ముంబై మొత్తాన్ని కరోనా మహమ్మారి వ్యాపించి ఉన్న సంగతి తెలిసిందే. అయితే అన్ని చోట్లా లాక్ డౌన్ ఎత్తేసిన ఇప్పుడప్పుడే ముంబై లో షూటింగ్స్‌కు అనుమతినిచ్చే అవకాశం లేదని తెలిసిందే. అందుకే పూరి విజయ్ సినిమాని హైదరాబాద్ లోనే ఏదో ఒక సెట్ వేసి షూట్ చెయ్యాలని డిసైడయ్యారట.  

 

ఇక ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా ఎక్కువ శాతం విదేశాల్లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. ఆస్ట్రియా, జార్జియా, యూరప్ అంటూ సినిమా కథలో రాసుకున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితి విదేశాలకు షూటింగ్స్ కోసం వెళ్లే పరిస్థితి లేదు. అందుకే రాధాకృష్ణ ప్రభాస్ సినిమా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. లాక్ డౌన్ అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. ఇందుకోసం ఇప్పటికే ఈ సినిమాకొసం సెట్స్ కూడా సిద్దం చేశారు. అంతేకాదు పుష్ప సినిమా కోసం కూడా సుకుమార్ కొంత భాగాన్ని విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసి కరోనా కాలంగా డ్రాపయ్యారు. అయితే ఇప్పుడు ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ చేయాలనుకుంటున్న తెలుగు సినిమాలకి రామోజీ ఫిల్మ్ సిటీనే సెట్స్ వేసి షూటింగ్స్ ఫినిష్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: