కీర్తి సురేష్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలైనప్పటికి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. చెప్పాలంటే సౌందర్య ని గుర్తు చేసింది. రాం హీరోగా నటించిన నేను శైలజ తో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే సక్సస్ ని అందుకుంది. ఆ తర్వాత నాని తో నేను లోకల్, మహానటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలలో నటించింది. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి గొప్ప పేరుని సంపాదించుకుంది. అందం తో పాటు అద్భుతమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 

 

తెలుగులో కీర్తి సురేష్ ఇప్పటి వరకు చేసిన సినిమాలలో కాస్త కూడా గ్లామర్ గా గాని లిమిటేషన్స్ దాటి ఎక్స్‌ఫోజింగ్ చేయడం గాని చేసింది లేదు. చాలా సెలెక్టివ్ గా హుందాతనంతో కూడుకున్న పాత్రలని, సినిమాలని ఎంచుకొని టాలీవుడ్ లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం నితిన్ తో చేస్తున్న సినిమా తో పాటు తమిళంలో చేస్తున్న సినిమాలు కూడా మంచి కథా బలమున్నవి ఎంచుకుంది.

 

అయితే ఈ మద్య కీర్తి సురేష్ కాస్త బరువు తగ్గడం తో కొత్త గా కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. మహానటి సమయంలో కాస్త బొద్దుగా ఉన్న కీర్తి ఇప్పుడు నాజూకుగా తయారైంది. అయితే ఓ మీడియా ఏజెన్సీ వారు కీర్తి ఎక్స్ పోజింగ్ చేయడానికి, గ్లామర్ క్యారెక్టర్స్ ఒప్పుకోవడానికే ఇలా కీర్తి సురేష్ సన్నబడిందని వాళ్ళకి నచ్చినట్టు వార్తలు రాశారు. ఇదే కాదు మొన్నా మద్య కూడా కీర్తి సురేష్ పెళ్ళి చేసుకోబోతుందని వార్తలు సృష్ఠించారు.

 

అయితే దాన్ని వెంటనే కొట్టి పారేస్తూ తన పెళ్ళి మీద వస్తుంది గాలి వార్తలని క్లారిటి ఇచ్చింది. అలాగే ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ కాస్త ఘాటుగానే స్పందించింది. ఎక్స్ పోజింగ్ విషయంలో తనపై వచ్చిన ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని నిర్మిహమాటంగా తేల్చి చెప్పింది. పాపం ఇలా ఇంకా ఎన్ని సార్లు ఫేక్ న్యూస్ కి క్లారిటి ఇస్తూ ఉండాలో అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: