నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మైండ్ సెట్ గాని స్ట్రాటర్జీ మొత్తం మారిపోయింది. అది 2020 ప్రారంభం లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా చూస్తే అర్థమవుతుంది. ముందు నుంచి అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోనే ఉంటాడు. వాస్తవంగా అల వైకుంఠపురములో సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్ రావడానికి అల్లు అర్జున్ ప్లానింగ్ కారణమన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. తాజాగా బన్నీ పుష్ప సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడని టాలీవుడ్ మీడియా సమాచారం. 

 

అయితే పుష్ప పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమా విడుదల దగ్గర పడుతున్నప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ తెచ్చేందుకు ఇప్పటి నుంచే రక రకాల ప్లానింగ్స్ వేస్తున్నారట. ఈ విషయంలో అల్లు అర్జున్ బాగా వినూత్నంగా  ఆలోచిస్తున్నాడట. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కాబట్టి పాన్ ఇండియా లెవల్ లో ప్రమోట్ చేయాలి. అందుకే ఈ విషయంలో అల్లు అర్జున్ కొత్తగా ప్లాన్ చేశాడట.

 

ఇప్పటి నుంచే బాలీవుడ్ మీడియాతో బన్నీ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడట. అల వైకుంఠపురములో సినిమా అప్పటినుండి బన్నీ బాలీవుడ్ మీడియాతో తన సినిమా ప్రమోషన్స్ కి ప్లాన్స్ చేశాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమా కోసం ఇప్పటి నుంచే అక్కడి మీడియాతో అప్‌డేట్స్ ఇస్తూ ఉన్నాడట.  

 

పుష్ప సినిమా లుక్ తోనే అందరి చూపు తనవైపు తిప్పుకుని బాలీవుడ్ మేకర్స్ దృష్ఠిలో పడడానికి బాగానే ప్రయత్నిస్తున్నాడని తాజా సమాచారం. మళ్ళీ  షూటింగ్ మొదలవగానే పుష్ప అప్‌డేట్స్‌ని బాలీవుడ్ మీడియాకి ఇచ్చే విధంగా అన్నీ సిద్దం చేసుకుంటున్నారట. మొత్తానికి పుష్ప కోసం అల్లు అర్జున్ ప్లాన్స్ అదిరిపోయాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: