బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తర్వాతి చిత్రాలలో తెలుగు నటులతో పాటు పాన్ ఇండియా అప్పీల్ క్రియేట్ చేయడానికి ఆ భాషా, ఈ భాషా అని తేడా లేకుండా అన్ని చోట్ల నుండి నటులని తీసుకుంటున్నారు. సాహో సినిమాలో ఎంత మంది పరభాషా నటులున్నారో చూశాం. అయితే అంతమంది నటులని పెట్టుకుని ఏ ఒక్కరికీ సరైన ప్రాధ్యాన్యత లేకపోవడంతో విమర్శలు కూడా వచ్చాయి.

 

అయితే ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో లవ్ స్టోరీ చేస్తున్నాడు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపిస్తుంది. ఇకపోతే ప్రభాస్, పూజా తర్వాత ఈ సినిమాలో కనిపించే స్టార్ క్యాస్ ఎవరనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాలో ఒకానొక ప్రత్యేక పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.

 

సల్మాన్ ఖాన్ హీరోగా మైనే ప్యార్ కియా సినిమాలో నటించిన భాగ్యశ్రీ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటించనుందట. చాలా రోజుల వరకూ సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న భాగ్యశ్రీ ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ గతంలో ప్రభాస్ రివీల్ చేసినట్లు చెబుతున్నారు. సాధారణంగా సొషల్ మీడియాలో కనిపించని ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా భాగ్యశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

 

అయితే భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుందా లేదా మరో ముఖ్యమైన పాత్రా అనేది ఇంకా తెలియలేదు. అధికారికంగా ఈ సినిమా టైటిల్ ఇంకా బయటకి వెల్లడించకపోవడంతో ఓ డియర్ అనే పిలుస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటూ ప్రభాస్ ఫ్యాన్ గోలచేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: