టాలీవుడ్ గ్లామ‌ర‌స్ యాంక‌ర్ల‌లో లాస్య ఒక‌రు. ఎంతో చ‌లాకీగా చురుకుగా ఉండే లాస్య బుల్లితెర మీద త‌న యాంక‌రింగ్ తో ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ను సొంతం చేసుకుంది. బుల్లి తెర‌పై యాంక‌ర్ లాస్య‌, ర‌వి జోడికి ఎంతో గుర్తింపు ఉంది. పెళ్లి చేసుకున్నాక ఆమె ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి విదేశాల్లో సెటిల్ అయిన లాస్య ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి వివ‌రాలు షేర్ చేసుకుంది. వీటిలో కొన్ని విష‌యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. 

 

లాస్య యాంక‌రింగ్ చేసిన‌ప్పుడే ఆమె ర‌వితో పాటు ప‌లువురితో ఏదేదో అంట క‌ట్ట‌డి గాసిప్ రాయుళ్లు వార్త‌లు రాసేవారు. అంతెందుకు యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌తో ఆమెకు పెళ్ల‌యిపోయి న‌ట్టు కూడా వార్త‌లు రాసేశారు. అయితే లాస్య వీట‌న్నింటికి చెక్ పెట్టేస్తూ పెళ్లి చేసుకుంది. లాస్య మంజు అనే సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌ను పెళ్లి చేసుకుంది. ఇక త‌న జీవితంలో గ‌తంలో చేదు సంఘ‌ట‌న‌లు జ‌రిగాయని.. వాట‌న్నింటిని తాను ప‌ట్టించుకోన‌ని చెప్పింది. ఆ యాంక‌ర్ తో మీ పెళ్ల‌య్యింద‌ట క‌దా.. ?  రాజ్ త‌రుణ్‌ను మీరు పెళ్లి చేసుకున్నార‌ట కదా ? అని ప‌లువురు గ‌తంలో మొఖం మీదే అడిగేశార‌ని చెప్పింది.

 

ఇక త‌న జీవితంలో ఓ చేదు సంఘ‌ట‌న జ‌రిగింద‌ని.. మా బావ‌తో నా పెళ్లి ఫిక్స‌య్యింద‌ని తెలిసి కూడా ఓ పెళ్ల‌యిన వ్య‌క్తి త‌న‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ని ఆమె చెప్పింది. నువ్వు ఊ అంటే నేను నా భార్య‌ను వ‌దిలేసి నీతో వ‌చ్చేస్తాన‌ని చెప్పాడ‌ని లాస్య చెప్పింది. అత‌డు నాతో చాలా మిస్ బిహేవ్ చేశాడ‌ని... అత‌డి మాట‌లు నాకు చాలా ఇబ్బంది క‌లిగించా య‌ని చెప్పింది. నువ్వ ఓకే చెప్పు నీతోనే ఉండిపోతాను.. నా భార్య ను కూడా వ‌దిలేసి వ‌స్తాన‌ని చాలా ఇబ్బంది పెట్టాడ‌ని ఆమె వాపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: