తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది ప్రియమణి. అందం, నటనతో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో పరిచయమైన ప్రియమణి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నటించింది. తమిళ సినిమా పరుత్తివీరన్ సినిమాలో నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా సాధించింది. కొన్నేళ్ల క్రితం సినిమాలకు బై చెప్పేసి బిజినెస్ మ్యాన్ ముస్తఫాను వివాహం చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అక్కడి సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తోంది.

IHG

 

కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా చేస్తున్న నారప్ప సినిమాతో పాటు, రానా హీరోగా వస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ అవకాశాల కోసం కూడా ఎదురు చూస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై బాలీవుడ్ పై ఆసక్తిని తెలిపింది. ‘అవకాశం వస్తే బాలీవుడ్ లో చేయాలని ఉంది. దర్శక, నిర్మాతలు తనకు అవకాశం ఇస్తే పాత్రకు తగిన న్యాయం చేయగలననే నమ్మకం ఉంది. గతంలో కొన్ని అవకాశాలు వచ్చినా కొన్ని కారణాల వల్ల చేయలేక పోయాను’ అని చెప్పుకొచ్చింది.

IHG'Chennai ...

 

నిజానికి ప్రియమణి బాలీవుడ్ లో గతంలోనే అడుగుపెట్టింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సినిమాలో షారుఖ్ తోనే ఆడిపాడింది. తర్వాత సినిమాలు తగ్గించుకుని పలు టీవీ షోల్లో చేస్తూనే ఉంది. మరి.. ప్రియమణి బాలీవుడ్ ఆశలను అక్కడి దర్శక, నిర్మాతలు పట్టించుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: