కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కాంబో లో తెరకెక్కుతున్న మాస్టర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. ఈపాటికే విడుదలకావల్సిన  ఈచిత్రం కరోనా వల్ల వాయిదాపడింది. ప్రస్తుతం మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు దాంతో ఈసినిమా ను దీపావళికి  తీసుకరావాలని ప్లాన్ చేస్తున్నారు. దీపావళి సీజన్ విజయ్ కి బాగా కలిసొచ్చింది. అందుకే ఈసినిమా ను కూడా  అప్పుడే  విడుదలచేయాలని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. 
 
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా  విజయ్ కి జోడిగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్ బి క్రియేటర్స్ పతాకం పై బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఆండ్రియా , శాంతన్ , అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మాస్టర్ తెలుగు వెర్షన్ హక్కులను యువ నిర్మాత మహేష్ ఎస్ కోనేరు  10కోట్ల కు దక్కించుకున్నాడు. ఇటీవల విజయ్ సర్కార్, విజిల్ తో  సూపర్  హిట్లు కొట్టడంతో  మాస్టర్ పై భారీ అంచనాలు వున్నాయి. త్వరలోనే ఈసినిమా టీజర్ విడుదలకానుంది. 
 
ఇక ఈసినిమా తరువాత విజయ్ ,ఏ ఆర్ మురగదాస్ తో సినిమా చేయనున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ తుపాకీ కి సీక్వెల్ గా  తెరకెక్కనున్న ఈ చిత్రానికి  థమన్ సంగీతం అందించనున్నాడు. విజయ్ సినిమా కు థమన్ సంగీతం అందించడం ఇదే మొదటి సారి. ఈఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా ను సెట్స్ మీదకు తీసుకెళ్లి  వచ్చే ఏడాది  విడుదలచేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి  మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: