టాలీవుడ్ లో ఆచార్య సినిమా గురించి ఇప్పుడు జరుగుతున్న్ చర్చలు అన్నీ ఇన్ని కాదు. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని పాత్రల కోసం దర్శకుడు పడుతున్న కష్టం కూడా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హీరోయిన్ ని ఎంపిక చేయడం కోసం దర్శక నిర్మాతలు చాల కష్టాలు పడుతున్నారు అనేది వాస్తవం. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం చాలా మందిని ట్రై చేసినా సరే ఫలితం ఉండటం లేదు. మొన్నటి వరకు కాజల్ అని అన్నారు. కాని ఇప్పుడు ఆమె నో చెప్పేసింది అని తెలుస్తుంది. అనుష్క అనుకుని ఆమె కోసం ట్రై చేసినా సరే పెద్దగా ఫలిత౦ మాత్రం ఉండటం లేదు అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

ఆమె కూడా నో అని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఆమెకు భారీగా ఇవ్వడానికి రెడీ అయినా సరే నో అని చెప్పింది అని అంటున్నారు. ఇప్పుడు ఆమె గురించి పక్కన పెట్టి రామ్ చరణ్ పాత్ర విషయానికి వస్తే ఆ పాత్రలో ఇప్పుడు మహేష్ బాబు ని తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. మహేష్ బాబు అయితే సినిమాకు బాగా ప్లస్ అవుతుంది అని ఇప్పటికే రామ్ చరణ్ చిరంజీవి సినిమాలో కనపడ్డాడు కాబట్టి అంత క్రేజ్ ఉండదు అని అంటున్నట్టు సమాచారం. చిరంజీవి కూడా దానిని దృష్టి లో పెట్టుకునే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు. 

 

ఈ సినిమాలో ఆ పాత్ర కోసం గానూ ఎన్టీఆర్ ని తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న చర్చ. టాలీవుడ్ లో ఈ సినిమా కోసం చిరంజీవి పడిన కష్టం ఎవరూ పడటం లేదు అని కొందరు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: