బాహుబలి సినిమా తర్వాత తెలుగులో ప్రభాస్ సినిమా అనగానే ప్రేక్షకులకు ఒక క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్ లో ఈ సినిమా ఒక సంచలనం. ఆ తర్వాత ప్రభాస్ చేసే సినిమాల కోసం ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు కూడా ఎదురు చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్ తో సినిమా చేయడానికి అగ్ర నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా చూస్తూ అతని తో సినిమాను ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ సినిమా అనేది ఒక సంచలనం అని బాహుబలి సినిమాను చూసిన చాలా మంది అన్నారు. 

 

ఆ సినిమాలో అతను కూడా ఒక సంచలనం అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా తరహాలోనే మరో భారీ ప్రాజెక్ట్ కి ప్రభాస్ సిద్దమవుతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. అయితే అది బాలీవుడ్ దర్శకుడు తీసుకుని వచ్చే సినిమా అని సమాచారం. ఆ సినిమా కోసం ప్రభాస్ ఇప్పటికే చర్చలు కూడా జరిపాడు అనేది టాలీవుడ్ జనాల మాట. ఆ సినిమా కోసం ఇప్పటికే అతను ముంబై కూడా వెళ్లి వచ్చాడు అని తెలుస్తుంది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా చర్చలు అన్నీ కూడా వాయిదా పడ్డాయని లాక్ డౌన్ అయిన తర్వాత చర్చలను పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు అని అంటున్నారు. 

 

లాక్ డౌన్ కారణంగా ప్రభాస్ ఇప్పుడు ముంబై లోనే ఉన్నాడు అనేది సమాచారం. లాక్ డౌన్ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో చేసే సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చే సినిమా కోసం అతను తను డేట్స్ ఇస్తాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: