యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకి జాన్, రాధే శ్యాం అన్న టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు చిత్ర బృందం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇప్పుడు చేయాల్సిన షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారట. ఇక ప్రభాస్ గత చిత్రం సాహో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ లో ప్రభాస్ కి అసాధారణమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ప్రభాస్ తన సినిమాని హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అందుకే కొంతమంది బాలీవుడ్ నటులను ఎంచుకున్నారు.

 

ఈ నేపథ్యంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీని నటింపజేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా గురించి అందులో భాగ్యశ్రీ  పాత్ర గురించి చాలా రకాలుగా వార్తలు వస్తున్నప్పటికి ఇన్నాళ్ళు మిన్నకుండా ఉన్న భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మాట వాస్తవమేనై తేల్చేసింది. స్వయంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వెల్లడించింది.

 

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా సినిమాతో భాగ్యశ్రీ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నార్త్ లో ఒక సంచనలం అయింది. అప్పట్లో మన టాలీవుడ్ మేకర్స్ భాగ్యశ్రీ ని తెలుగులో నటింపచేయాలని అనుకున్నారు. కాని అది సాద్యపడలేదు. ఇక బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. గత కొన్నేళ్ళుగా సినిమాలకి దూరంగా ఉన్న భాగ్యశ్రీ ప్రభాస్ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇక రీసెంట్ గా ప్రభాస్-భాగ్యశ్రీ ల మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటిస్తున్న మాట నిజం కాదని సమాచారం. సిస్టర్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: