టాలీవుడ్ లో వరసగా పెళ్ళి భాజాలు మోగుతున్నాయి. గత ఆదివారం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసందే. అత్యంత సన్నిహితుల మద్య లాక్ డౌన్ నిబంధనలకి అనుకూలంగా నిజామాబాద్ లో ఉన్న శీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైగా రెడ్డి ని వివాహమాడారు. ఆ తర్వాత రానా దగ్గుబాటి తనకి బాగా క్లోజ్ అయిన మిహికా బజాజ్ కి తన ప్రేమ విషయాన్ని తెలపగా తను అంగీకరించిందంటూ స్వయంగా తెలిపాడు. హైదరాబాద్ వాళ్ళైనప్పటికి ముంబై లో సెటిలయిన మిహికా బజాజ్ బాగా ఉన్నత కుటుంబం నుండే వచ్చింది. సొంతగా వ్యాపారం చేసున్నారు. 

 

ఇవి రెండు జనాలకి స్వీట్ సర్‌ప్రైజెస్ కాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సడన్ గా తన పెళ్ళి రేపే అంటూ షాకిచ్చాడు. గోవాలో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న నిఖిల్ పల్లవి వర్మ .. ఇరు కుటుంబాలు ఏప్రిల్ 16 న వివాహానికి ముహూర్తం నిశ్చయించారు. అయితే కారోనా కారణంగా ఇప్పటికే ఒకసారి పెళ్ళిని వాయిదా వేశారు. మరోసారి వాయిదా వేస్తే మూడం వస్తుందన్న కారణంగా ఇద్దరి జాతకాలు చక్కగా కుదరడంతో మే 14 దివ్యమైన మూహుర్తాన నిఖిల్ పల్లవి వర్మ ల వివాహం ఘనంగా జరిపించారు. 

 

ఈ వివాహానికి కేవలం బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక నిశ్చితార్ధం చేసుకొని పెళ్ళి సిద్దంగా ఉన్న హీరో నితిన్. ఈ నేపథ్యంలో నితిన్ కూడా త్వరలో మంచి ముహూర్తం చూసుకొని పెళ్ళి పీటలెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తానికి ఇలా మన టాలీవుడ్ హీరోలందరు ఒకరి తర్వాత ఒకరు పెళ్ళి చేసుకొని ఒక ఇంటివారవుతుండటంతో ఫ్యాన్స్ బంధు మిత్రులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన పెళ్ళి కబురు ఎప్పుడు చెప్తాడని ఫ్యాన్స్ చాలారోజులుగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో ప్రభాస్ కూడా గుడ్ న్యూస్ చెప్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: