సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకు సంబంధించి సంక్రాంతి సీజన్ ముగిసేవరకు అల్లు అర్జున్ మహేష్ అభిమానుల మధ్య రికార్డుల వార్ జరిగి ఇండస్ట్రీ హిట్ అన్న పదం పై అనేక ఆసక్తికర చర్చలు జరిగాయి. దీనితో ఈసమ్మర్ లో కూడ అనేక భారీ అంచనాలు ఉన్న సినిమాలు వస్తాయి అన్న అంచనాలతో సమ్మర్ సీజన్ విజేత ఎవరు అంటూ సంక్రాంతి సీజన్ ముగిసిన వెంటనే ఇండస్ట్రీలో అదేవిధంగా అభిమానుల మధ్య అనేక అంచనాలు మొదలయ్యాయి. 


అయితే అందరి ఊహనలను తలక్రిందులు చేస్తూ మార్చి నెల నుండి కరోనా మహమ్మారి ఉప్పెన ప్రారంభం కావడంతో సాధారణ వ్యక్తుల నుండి సెలెబ్రెటీల వరకు అందరు కరోనాకు భయపడి ఇంటికే పరిమితం అయిపోయారు. అయితే ఈనిశ్శబ్ద వాతావరణంలో సినిమాలు లేకపోయినా టాప్ హీరోల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో జరుగుతున్న ట్విటర్ వార్ ను చూసి టాప్ హీరోల అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 


లాక్ డౌన్ ప్రారంభం అయిన కొద్దిరోజులకే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరసపెట్టి పోస్టుల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ మొదలైన వారితో పాటు యంగ్ హీరోలు కూడా సోషల్ మీడియాలో  యాక్టీవ్ గా ఉన్నారు. షూటింగ్ లు లేకపోవడంతో ఖాళీగా ఉన్నవీరంతా ఇమేజ్ ను కాపాడుకోవడం కోసం ట్విట్టర్ ద్వారా ఎక్కువగా ప్రమోట్ చేసుకోడానికి చూస్తున్నారు. దీనికితోడు అభిమానులు తమ హీరోలకు సంబంధించి బర్త్ డే లకు సినిమాలకు సంబంధించి ట్రెండ్స్ క్రియేట్ చేయడానికి రకరకాల హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండింగ్ చేస్తూ ఇన్ని గంటల్లో ఇన్ని మిలియన్ల ట్వీట్స్ అంటూ రికార్డ్స్ గురించి గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారు. మా హీరో హ్యాష్ ట్యాగ్ కి ఇన్ని మిలియన్ల ట్వీట్ కౌంట్ వచ్చిందని. మీ హీరో ఈ ఫీట్ ని రీచ్ అవలేడని ట్విట్టర్ వార్స్ కూడ జరుగుతున్నాయి. 


దీనితో కలక్షన్స్ రికార్డ్ ల వారు లేకపోయినా ప్రస్తుతం హీరోల కోసం అభిమానుల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది.  కొంతమంది హీరోలు అయితే తమ పీఆర్వోల చేత పెయిడ్ ప్రొమోషన్స్ చేయించుకుంటూ నేషనల్ వైడ్ ట్రెండ్ కోసం తాపత్రయపడుతున్నారు అంటూ గాసిప్పులు వినిపిస్తున్నాయి. అయితే ఈ లాక్ డౌన్ పిరియడ్ లో తమ అభిమానుల సహాయంతో మిగతా హీరోల పై అనేకమంది హీరోలు పరోక్ష యుద్ధం చేస్తున్నారు అంటూ కొందరు విశ్లేషకుల అభిప్రాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: