సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత దంపతుల సూపర్ కిడ్స్ గౌతమ్ కృష్ణ సితార పాప గురించి ప్రత్యేకముగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరికి ఈ వయసులోనే భారీ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ తమ టాలెంటులని బయటకి తీస్తూ తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. మహేష్ - నమ్రత వీరికి సంభందించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ అభిమానులకు షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మహేష్ ముద్దుల తనయుడు చేసిన మంచి పనిని మహేష్ నమ్రతలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

 

''పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కలుగదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!'' అనే పద్యం ఉంది. దీని తాత్పర్యం ఏంటంటే కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది. పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని. మహేష్ బాబు తో కలిసి '1 నేనొక్కడినే' లాంటి సినిమాలో మంచి మార్కులు కొట్టేసిన గౌతమ్ ఇప్పుడు వ్యక్తిగా కూడా ఓ మెట్టు ఎక్కి కష్ట కాలంలో ఇతరులకు సాయం చెయ్యడంలో నాన్నకు తీసిపోకుండా తన తండ్రి మహేష్ ను గర్వపడేలా చేసాడు. 

 

గౌతమ్ తన స్నేహితులతో కలిసి “అక్షయ బంధన” పేరిట నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తూ తమ వంతు సాయం చెయ్యడం అందుకు గౌతమ్ నాయకత్వం వహించడం గర్వ కారణంగా ఉందని మహేష్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. అలాగే వారు చేపట్టిన ఈ కార్యక్రమానికి గాను ఎవరైనా డొనేషన్ చెయ్యాలి అంటే వారి వెబ్ సైట్ ద్వారా చెయ్యొచ్చు అని తెలిపారు. ఈ కష్ట కాలంలో గౌతమ్ ఇలాంటి గ్రేట్ మూవ్ తీసుకోవడం నిజంగా మహేష్ కు చాలా గర్వకారణం అని చెప్పాలి. ఈ వయసులోనే దాన గుణములో సూపర్ స్టార్ లా ఆలోచిస్తున్నాడంటూ మహేష్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: