టాలీవుడ్ లో చిరంజీవి అనగానే జనాలకు ఒక రకమైన క్రేజ్ అనేది ఉంటుంది. చిరంజీవి సినిమాలు అనగానే పనులు మానుకుని చూసే ప్రేక్షకులు ఆయనతో సినిమా అనగానే ఇతర సినిమాలను కూడా కాదు అనుకునే దర్శకులు ఇలా మనకు ఎందరో కనపడుతూ ఉంటారు. చిరంజీవి కెరీర్ ఎప్పుడు కూడా పీక్స్ లోనే ఉంటూ వచ్చింది. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అనేది వాస్తవం. ఇక ఆయన వివాహం కూడా టాలీవుడ్ లో ఒక సంచలనంగా చెప్పుకుంటూ ఉంటారు జనాలు. 

 

అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ ను ఆయన వివాహం చేసుకున్నారు. సురేఖ ను చిరంజీవి వివాహం చేసుకున్న సమయంలో ఆయన కెరీర్ లో ఇంకా తక్కువగానే ఉన్నారు. అప్పటికి రామ లింగయ్య అగ్ర నటుడు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూడటమే కాదు ఆయన డేట్స్ కోసం ఎదురు చూసిన స్టార్ హీరోలు కూడా అప్పట్లో ఉండే వారు అని చెప్తూ ఉంటారు. ఎన్టీఆర్ అక్కినేని శోభన్ బాబు వంటి వారు ఆయన తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు అప్పట్లో అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆమెను వివాహం చేసుకున్నారు చిరంజీవి. ఇక అకడి నుంచి ఆయన దశ తిరిగింది అని ఆయన సినిమాల మీద అల్లు అరవింద్ పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది అని చిరంజీవి సినిమాల ఎంపికలో అల్లు కుటుంబం చాలా జాగ్రత్తగా వ్యవహరించే వారు అని చెప్తూ ఉంటారు. అల్లు రామలింగయ్య కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ చిరంజీవి తో సినిమాలు చేయించే వారు అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: