కరోనా వల్ల లాక్ డౌన్ రావడం తో ఇప్పటికే విడుదలకావాల్సిన సినిమాల విడుదల వాయిదాపడింది. ప్రస్తుతం కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో ఇప్పట్లో థియేటర్లు  తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు దాంతో కొన్ని మీడియం రేంజ్ సినిమాలు  డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకావాడిని రెడీ గా వున్నాయి. అందులో భాగంగా ప్రముఖ ఓటిటి  సంస్థ అమెజాన్ ప్రైమ్  7 సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి  రెడీ అయ్యింది. ఇందుకోసం ఆయా సినిమాల నిర్మాతలకు  ఊహించినదానికంటే ఎక్కువగానే చెల్లించింది.  అందులో 2తమిళ సినిమాలు వుండగా రెండు కన్నడ , రెండు హిందీ అలాగే ఓ మళయాలం సినిమా కూడా వుంది. 
 
ఈ ఏడు సినిమాల్లో మొదటగా విడుదలకానున్న చిత్రం పోన్మగళ్ వందాల్ (తమిళం). స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక  ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్నిఫెడ్రిక్ డైరెక్ట్ చేశాడు. సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం మే 29న ప్రైమ్ లో విడుదలకానుంది. ఇక రెండో సినిమా రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్. ఈశ్వర్ కార్తీక్ డైరక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించాడు. జూన్ 19న ఈ చిత్రం తమిళ్ తోపాటు తెలుగులోనూ  విడుదలకానుంది. 
 
ఈ రెండు సినిమాల తరువాత కన్నడ మూవీ లా జూన్ 26న విడుదలకానుండగా జయరాం ,అదితి రావ్ హైదరీ నటించిన మళయాలం మూవీ సోఫియామ్ సుజాతీయం అలాగే కన్నడ మూవీ  బిర్యానీ తోపాటు ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ నటించిన బయోపిక్ శకుంతలా దేవి (హిందీ) తోపాటు  గులాబో సితాబో (హిందీ) సినిమాలు కూడా త్వరలోనే  ప్రైమ్ లో విడుదలకానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: