టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని  దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదేంటోగాని పవర్ స్టార్  కనిపిస్తేచాలు పిచ్చెక్కి పోతుంటారు అభిమానులు.  ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ పై అభిమానం చూపిస్తూ ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు సబ్ కలెక్టర్ అయ్యారు. 

 

 

 దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ హీరోగా దాదాపు తొమ్మిదేళ్ల క్రితం తెరకెక్కిన సినిమా పంజా. పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్తో గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించి తన యాక్షన్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే.. అయితే పంజా ఆడియో ఫంక్షన్ గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఈ రోజుకి కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పంజా ఆడియో ఫంక్షన్ రోజు స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐఐటీ-జేఈఈ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి పృద్వి తేజ్ ను సన్మానించారు.

 

 

 కేవలం స్వయంగా పవన్ కళ్యాణ్ అతని సన్మానించడమే  కాదు ఉన్నత శిఖరాలకు ఎదగాలి  అంటూ ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ ఆకాంక్షించిన విధంగానే పృద్వి తేజ... తాజాగా సివిల్స్లో 24 వ ర్యాంకు సాధించి మదనపల్లి సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పవన్ అభిమానులు అందరూ తెగ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు అందరూ నాడు పవన్ తో  పృద్వి తేజ్ వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమాని సబ్ కలెక్టర్  కావడం తమకు ఎంతో గర్వ కారణం అని అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: