తెలుగు సినిమాల్లో తనదై స్టైల్లో సొంత కధలు రాసుకుంటూ సినిమాలు తీసే దర్శకుల్లో సంపత్ నంది ఒకరు. తొలి సినిమా ఏమైంది ఈ వేళ నుంచి గౌతమ్ నందా వరకూ తీసిన ఆయిదు సినిమాల కథలు తానే రాసుకున్నాడు. హిట్లు, ఫ్లాప్ లకు అతీతంగా ఆయన కెరీర్ కొనసాగుతోంది. రామ్ చరణ్ తో తెరకెక్కించిన ‘రచ్చ’ సినిమా హిట్ అవడంతో సంపత్ నంది లైమ్ లైట్ లోకి వచ్చాడు. రీసెంట్ గా సంపత్ నంది మాట్లాడుతూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చాడు.

 

 

‘రచ్చ’తో అవకాశం ఇచ్చిన చిరంజీవికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండే సంపత్ నందికి చిరంజీవితో ఓ సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఓ కథ రాసుకుని చిరంజీవికి వినిపిస్తానని అంటున్నాడు. చిరంజీవితో చేస్తే అలాంటి చారిత్రక కథాంశంతోనే చేయాలనేది అతని డ్రీమ్ గా చెప్పుకొచ్చాడు. పవన్ కల్యాణ్ తో కూడా సినిమా చేయాలని ఉందని అంటున్నాడు. నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అవకాశం పవన్ మొదట సంపత్ కే ఇచ్చాడు. కానీ.. అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టు సంపత్ చేజారింది. ఎప్పటికైనా పవన్ తో సినిమా చేస్తానని అంటున్నాడు.

 

 

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సీటీమార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సంపత్ నంది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో తమన్నా మాట్లాడుతుందని తెలుస్తోంది. సంపత్ నంది కెరీర్ హిట్లు, ఫ్లాపులకు అతీతంగా కొనసాగుతోంది. అయినా సంపత్ టేకింగ్ పై నిర్మాతలకు, హీరోలకు నమ్మకం ఉంది. సీటీమార్ సినిమా కథాంశం ఇప్పటికే చర్చనీయాంశమై ఆసక్తి రేపుతోంది. సంపత్ తన టేకింగ్ తో సినిమాను హిట్ చేస్తే మరిన్ని మంచి అవకాశాలు రావడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: