కీర్తి సురేష్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. రామ్ హీరోగా తెరకెక్కిన `నేను శైలజ` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్.. ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుందో వివరించాల్సిన పని లేదు. ఇక తర్వాత సావిత్రి బయోపిక్గా తెరకెక్కిన మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది కీర్తి సురేష్. ఈ సినిమాకు ముందు తెలుగులో రెండు, మూడు సినిమాలు చేసినప్పటికీ.. మహానటి చిత్రంతోనే కీర్తి సురేశ్ మంచి నటిగా గుర్తింపు పొందింది.
ఈ సినిమాతో ఆమె పేరు ప్రఖ్యాతులు ఎంతగానో పెరిగాయి. జాతీయ అవార్డులు సైతం ఆమె సొంతమయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ను మహానటి గా ఎంచుకుని.. తనరూపంలో సావిత్రిని కళ్ళముందు సాక్షాత్కరింప చేశాడు. నేనే మీ మహానటి సావిత్రిని అనేలా ఆ పాత్రకు ప్రాణం పోసింది కీర్తి సురేష్. ఇక ప్రస్తుతం కీర్తి తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.
అలాగే తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్కు జోడిగా 'రంగ్దే'లో నటిస్తోంది. దీనితో పాటు 'మిస్ ఇండియా' అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్తో సినిమా షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. దీంతో సినీ తారలందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తమ హాట్ హాట్ లుక్స్తో షోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ బ్లాక్ డ్రెస్లో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. మరి వాటిపై ఓ లుక్కేసేయండి.