ఇప్పుడు టాలీవుడ్ లో చాల మంది యువ హీరోలు తమ వంతు సాయం చేస్తున్నారు ప్రజల కోసం. కరోనా లాక్ డౌన్ తో కష్టాలు పడుతున్న జనాలకు తాము అండగా ఉంటాం అని చెప్తున్నారు. చిన్న చిన్న సహాయాలు చేస్తూ వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు టాలీవుడ్ జనం. ఎవరి స్థాయికి తగిన విధంగా వారు సహాయం చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు మెగా హీరో సాయి ధరం తేజ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... 

 

సాయి ధరం తేజ్ ఇప్పుడు తన అభిమానుల కోసం ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాడు. లాక్ డౌన్ లో ఏ పనీ చేసుకోలేని వికలాంగుల కోసం అతను ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నాడు. మొత్తం ఒక జిల్లాలో ఉన్న వికాలాంగుల కోసం గానూ ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా వారికి ప్రతీ నెల ఇంత అందించాలి అనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు చిరంజీవి సహకారం కూడా అతను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ తో అతను మాట్లాడి దీని మీద అతని ఆలోచనను కూడా చెప్పినట్టు తెలుస్తుంది. 

 

దీనికి చిరంజీవి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కూడా వచ్చింది అని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ తో కూడా అతను దీనికి సంబంధించి మాట్లాడినట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఎప్పుడు అభిమానులకు సహాయం చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. త్వరలోనే దీని మీద స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సాయి ఆలోచన తెలుసుకున్న చిరంజీవి తాను కూడా కొంత సహాయం చేస్తాను అని చెప్పారు అని అంటున్నారు టాలీవుడ్ జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: