మన తెలుగులో చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన తో సినిమా చెయ్యాలి అని ఎందరో దర్శక నిర్మాతలు ముందు నుంచి ఆసక్తి చూపిస్తున్నారు. అగ్ర దర్శకులు చిన్న దర్శకులు ఆయన తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆచార్య నే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన కోసం చాలా మంది దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అగ్ర దర్శకులు కూడా కథలు పట్టుకుని రెడీ గా ఉన్నారు. 

 

కథలు సిద్దంగా ఉన్నా సరే చిరంజీవి మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన తో సినిమా చేయడానికి మురుగదాస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి తో రీ ఎంట్రీ సినిమా చెయ్యాలి అనేది ఆయన ప్లాన్ కాని అప్పుడు అది కుదరలేదు. ఇప్పుడు ఎలా అయినా సరే సినిమా చేయడానికి గానూ ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి కూడా దాదాపుగా కథ వినేసారు అని రామ్ చరణ్ కూడా నిర్మాత గా వ్యవహరించడానికి ముందుకు వచ్చాడు అని అంటున్నారు. మరి ఈ సినిమా చేస్తారా లేదా అనేది తెలియదు. 

 

ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అనేది టాలీవుడ్ జనాల మాట. రామ్ చరణ్ కూడా ఒకసారి కథ విని ఓకే చేస్తాడు అని తెలుస్తుంది. అప్పుడు చిరంజీవి సినిమా చేయడానికి రెడీ అయితే లూసిఫర్ పరిస్థితి ఏంటీ అనే చర్చ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతుంది. ఆ సినిమాను పవన్ కి ఇచ్చే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: