తెలుగు వివాదాస్పద దర్శకుడు వర్మ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో...ఎన్నో సినిమాలను విమర్శించడం...ఊరికే కారణం లేకుండా అందరికీ రెచ్చిపోయే లా అయిందానికి కానిదానికి నోరు పారేసకోవడం..వర్మకు వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం వేరేలా చెప్పన్నక్కర్లేదు.. అలా చేయడంతో వర్మ అందరి దృష్టిని ఆకర్షిస్తారు.. ఇకపోతే వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విమర్శలు మూట కట్టుకున్న విషయం తెలిసిందే..

 

 

 

ఆ మద్య ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సెగలు రేగిన సంగతి తెలిసిందే... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయంపై అమరావతి ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ అధికార పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉద్యమ బాట కూడా జరిగిన సంగతి తెలిసిందే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌‌గా ఉన్న ఏపీ రాజధాని ఇష్యూపై వివాదాస్పద దర్శకుడు తనదైన శైలిలో స్పందిస్తూ కొత్త రచ్చ చేశాడు..

 

 

 

 

వర్మ శిష్యుడు తెరకెక్కించి న బ్యూటిఫుల్ చిత్ర ప్రమోషన్లో భాగంగా వైజాగ్ వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు వర్మ. దీనిలో భాగంగా ‘ఏమయ్యా వర్మా.. రాజధానిపై నీ అభిప్రాయం ఏంటి అని ఓ జర్నలిస్ట్ సోదరుడు అడిగిన ప్రశ్నకు వర్మ మార్క్ ఆన్సర్ వచ్చింది.హార్ట్ ఫుల్‌గా చెప్పాలంటే ఓటు అనే ఎఫెక్షన్‌తో ఏ పొలిటిషియన్ ఉండడు. ఒకవేళ అలా ఉంటే రాజధాని ఒక చోట కాదు.. నాయకులు, ప్రజలు ఉన్న ప్రతి చోట పెట్టాలి. పర్శన్‌కి అడ్మినిస్ట్రేషన్‌కి కనెక్షన్ ఉండాలనే వాదన కరెక్ట్ అయితే రాజధాని మూడు చోట్లే ఎందుకు ఉండాలి? మిగిలిన చోట్ల ఎందుకు ఉండకూడదు. ప్రతి ఊరిలోనూ క్యాపిటల్ ఉండాలి... అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవ్వడంతో పాటుగా  అందరి చేత విమర్శలు అందుకున్నాయి.. 

 

 

 

 

ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ  బర్త్ డే అంటూ కరోనా టైమ్ లో నాకు విష్ చేయండి అంటూ చేశాడు..అంతే కాకుండా కరోనా పై కొత్త పద్దతులు అంటూ ప్రజలకు తల నొప్పిగా మారాడు అని తెలుస్తుంది.. దీంతో ప్రజలు ఆయన ప్రవర్తన పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: