తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీలకు క్రేజ్ బాగా పెరిగింది. అందులో మల్టీ స్టార ర్  సినిమాలు అయితే ప్రేక్షకులకు పండగే. అయితే ఈ నేపధ్యంలో ప్రస్తుతం అతి పెద్ద పాన్ ఇండియా మూవీ గా త్రిపులార్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. రాం చరణ్, ఎన్టిఆర్, రాజమౌళి కాంభో లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా. అయితే ఈ సినిమా గురించిన ప్రకటన వచ్చిన దగ్గర నుండి నందమూరి, మెగా ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలిసిన సంగతే.

 

రాజమౌళి  దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్టిఆర్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. అయితే ఈ సినిమాను క్రేజీ ప్రొడ్యూసర్  దానయ్య నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్ డేట్ విడుదల చేసారు దానయ్య. కరోనా కారణంగా సినిమా షూటింగ్ నెల రోజుల నుండి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ అనంతరం మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. 

 

కాని ఇంకా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో తక్కువ మంది సిబ్బందితో షూటింగ్ లు చేసుకోవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే ఇది భారీ ప్రాజెక్ట్ కనుక ఆ విధంగా చిత్రీకరణ అసంభవమని భావించిన చిత్ర  యూనిట్  సినిమా షూటింగ్ వాయిదా వేసారు. దీని తో ఈ సినిమా అనుకున్న విధంగా సంక్రాంతికి విడుదల అవ్వటానికి సాధ్యపడనందున ఏప్రిల్ 28 న విడుదల చేయనున్నట్టు నిర్మాత దానయ్య తెలియ చేసారు. దీనితో ప్రేక్షకుల ఆశల పై నీళ్ళు చల్లినట్టు అయ్యింది. రాజమౌళి తీసిన బాహుబలి 2 కూడా ఈ తేదీనే విడుదల అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: