టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ రిపీట్ కాబోతున్నాయి. హీరో డైరెక్టర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా కలుపుకుని మరోసారి హిట్ కోసం జతకట్టబోతున్నారు. మరోసారి మ్యాజిక్ చేయడానికి హిట్ కాంబినేషన్లు కలవబోతున్నాయి. స్టార్ హీరో.. హిట్ డైరెక్టర్ లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్న వాళ్లు మరోసాకి ఆడియన్స్ ను అలరించబోతున్నారు. గబ్బర్ సింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హిట్ కాంబో.. మరోసారి రిపీట్ కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ 2012 లో గబ్బర్  సింగ్ తెరకెక్కించాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్  మ్యాజిక్ తో పాటలు సూపర్ హిట్ అయ్యాయి.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

 

గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన 8 ఏళ్ల తరువాత మరోసారి ఆ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.. ఆల్ రెడీ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక మూడో సినిమా హరీష్ శంకర్ తో చేయబోతునట్టు ఎనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ ను కన్ ఫామ్ చేశారు రీసెంట్ గా సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు కూడాపెడుతున్నారు.

 

పుష్ప సినిమాతో మరో హిట్ కాంబినేషన్ రీపీట్ కాబోతుంది.అల్లు అర్జున్-సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్  ముగ్గురి కాంబోలో ఆల్ రెడీ రెండు సినిమాలు వచ్చాయి. ఆర్య,ఆర్య-2 సినిమాలకు ఈ ముగ్గురు కలిసి పనిచేశారు హిట్ కొట్టారు. మళీ 11 ఏళ్ల తరువాత ఈ ముగ్గురు పుష్ప  సినిమాకు కలిసి వర్క్ చేస్తున్నారు.  ఆర్య 2 తరువాత సుకుమార్- దేవిశ్రీ, బన్నీ-దేవిశ్రీ కాంబోలలో సినిమాలు వచ్చాయి కాని.. అల్లు అర్జున్-సుకుమార్-దేవిశ్రీ కాంబోలో మళ్లీ మూవీ రాలేదు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో ముగ్గురు ముచ్చటగా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

 

మరో సారి రిపీట్ కాబోతుంది ఎన్టీఆర్- త్రివిక్రమ్ -తమన్ కాంబినేషన్. ఈ ముగ్గురి కలయికలో అరవింద సమేత సినిమా వచ్చి హిట్ అయ్యింది. ఎన్టీఆర్ తో ఫస్ట్ సినిమా హిట్ కొట్టాడు త్రివిక్రమ్. అంతే కాదు తమన్ మ్యూజిక్ కూడా మెస్మరైజ్ చేసింది. దాంతో రీసెంట్ హిట్ అల వైకుంఠపురములో  సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఈ సినిమా ఎంత మ్యూజికల్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఈ మధ్యే ఎన్టీఆర్ తో మరో సినిమా ఎనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమా మ్యూజిక్ బాధ్యతలు కూడా తమన్ కే ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: