అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో అందరికీ తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంతలా బ్లాక్ బస్టర్ కావడానికి థమన్ అందించిన మ్యూజిక్ బిగ్గెస్ట్ అస్సెట్ గా చెప్పవచ్చు. సినిమా రిలీజ్ కాకముందే అలవైకుంఠపురములోని అన్ని పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సామజవరగమనా మొదలుకుని, రాములో రాములా, బుట్టబొమ్మ ఇలా ఒక్కో పాట దేనికదే ప్రత్యేకంగా నిల్చింది.

 

సోషల్ మీడియాలో ఈ పాటల సందడి మామూలుగా లేదు. సినిమా రిలీజై నాలుగు నెలలు కావొస్తున్నా ఈ పాటల సందడి ఇంకా ఆగిపోలేదు. టిక్ టాక్ వీడియోల్లో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. రాములో రాములా, బుట్టబొమ్మ పాటలకి సెలెబ్రిటీలు సైతం కాలు కదిపారంటే వాటి రీచ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లిరికల్ సాంగ్స్ ఎంతలా హిట్ అయ్యాయో వీడియో సాంగ్స్ అంతకుమించి హిట్ అయ్యాయి.

 

దాంతో అల వైకుంఠపురములోని ఆల్బమ్ కి వన్ బిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఆల్బమ్ కి ఇంతటి రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో విడుదల అయిన ఈ పాటలన్నింటికీ కలిపి వన్ బిలియన్ వ్యూస్ వచ్చి రికార్డుని నెలకొల్పింది. అయితే తాజాగా ఈ రికార్డుకి దగ్గరలో మరో సినిమా ఉండడం విశేషం. ధనుష్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మారి 2” సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

 

ఈ సినిమాలోని రౌడీబేబీ పాట ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఈ పాట 844 మిలియన్ వ్యూస్ ఈ వీడియో సాంగ్ సాధించడం మూలాన ఈ సినిమా మొత్తం ఆల్బమ్ కు ఇప్పుడు 999 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో అలవైకుంఠపురములో తర్వాత ఆ ఫీట్ ని అందుకుంటున్న హీరోగా ధనుష్ ని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: