తమన్నా భాటియా, శృతిహాసన్ దక్షిణ ఫిలిం ఇండస్ట్రీ లో పాటు హిందీలో కూడా అగ్ర తారలుగా ఎదిగారు. హ్యాపీ డేస్ సినిమా తర్వాత తమన్నా కెరీర్ పీక్ స్టేజ్ లో కి వెళ్ళగా... గబ్బర్ సింగ్ సినిమా అనంతరం శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అగ్రతారలు ఇద్దరు కాలక్రమేణా మంచి స్నేహితులయ్యారు. సినిమాల్లో బిజీగా ఉంటూ ఎప్పుడు ఫోన్లలో సంభాషించుకునే వారు. అప్పట్లో చాటింగ్ చేయడం, వీడియో కాల్స్ మాట్లాడకోవడం వీరికి దినచర్యగా మారింది.


అటువంటి సమయంలోనే తమన్నా భాటియా శృతిహాసన్ ముంబై విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్నారు. అప్పటి వరకు కేవలం ఫోన్ ద్వారానే మాట్లాడుకున్న వీరు ఒకేసారి ఫేస్ టు ఫేస్ ఎదురయ్యేసరికి... వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విమానాశ్రయంలో ఒకరివైపు మరొకరు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకున్నారు. ఈ దృశ్యాలను చూస్తున్న అక్కడివారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వీరి స్నేహబంధం చూసి ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఫోటోల మీద ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుని తమ సంతోషాన్ని వ్యక్తపరిచి అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని కల్పించారు.


ఆ రోజు నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు విదేశాలకు వెళుతూ తమ సమయాన్ని గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండగా తమన్నా భాటియా ఒంటరిగా మిగిలిపోయింది. ఒక తమిళ్ ఛానల్ ఇంటర్వ్యూలో తమన్నా భాటియా మాట్లాడుతూ... శృతి హాసన్ ని బాగా మిస్ అవుతున్నాను అని తన బాధను వ్యక్తం చేసింది. ఇద్దరు హీరోయిన్ల కథ తన దగ్గరకు వస్తే ద్వితీయ కథానాయకి పాత్రలో శృతి హాసన్ ని తీసుకోమని వెంటనే చెప్తాను అని ఆమె తెలిపింది. కాజల్ తో కలసి నిర్మాతగా అవతారం ఎత్తనున్న తమన్నా శృతిహాసన్ ని కూడా తన నిర్మాణ సంస్థలో చేర్చుకుంటుంది అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: