సరిగ్గా పదేళ్ల క్రితం ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేసిన మాయను మర్చిపోలేం. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమాకు షార్ట్ ఫిలిం నేపథ్యంలో సీక్వెల్ రానుంది. ఇందుకు సంబంధించి త్రిషతో చేసిన టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడీ షార్ట్ ఫిలింకు మరో అదనపు ఆకర్షణ రానుంది. సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ ఈ షార్ట్ ఫిలింకు సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని చెన్నై సమాచారం.

 

 

సినిమా విజయంలో రెహమాన్ అందించిన పాటలు ఏస్థాయిలో హెల్ప్ అయ్యాయో తెలసిన విషయమే. ముఖ్యంగా రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఇటువంటి మ్యాజిక్కే మళ్లీ ఈ షార్ట్ ఫిలింతో ఈ టీమ్ చేయనుందని తెలుస్తోంది. దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తతు విపత్కర పరిస్థితుల్లో సినిమాల విడుదలపై నెలకొన్న సస్పెన్స్ కు వీరి ప్రేమను జోడించి ఈ షార్ట్ ఫిలిం తీస్తున్నాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. జెస్సీ పాత్రలో త్రిష.. కార్తీక్ పాత్ర చసిన శింబుకు ఫోన్ చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

 

ఈ వీడియోలో ‘అధైర్య పడకు కార్తీక్.. మళ్లీ మంచి టైమ్ వస్తుంది. ధియేటర్లు ఓపెన్ అవుతాయి. ఈలోగా సినిమాల రిలీజ్ కు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి’ అంటూ శింబుకు, త్రిష ధైర్యం చెప్తుంది. తెలుగులో ఈ సినిమా విజయం నాగచైతన్య, సమంతల కెరీర్ కు బూస్టప్ ఇచ్చి దోహదపడింది. తమిళ్ లో ట్రాజెడిక్ ఎండింగ్ ఉన్నా అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ షార్ట్ ఫిలింతో శింబు – త్రిష మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: