బాహుబలి తర్వాత రాజమౌళి ట్రిపుల్ ఆర్ అంటూ మరో సంచలనానికి నాంది పలికాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ఇక త్వరలో కొమరం భీమ్ టీజర్ కూడా వస్తుందని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. 


అలియా భట్, ఒలీవియా మోరిస్ తో పాటుగా సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నారు. కె.ఎల్ నారాయణన్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది. ఈ మూవీ గురించి రాజమౌళి చెప్పినా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇంకా రావాల్సి ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మే 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్. 


ఇక ఈ సినిమా నుండి వచ్చిన మరో క్రేజీ న్యూస్ ఏంటంటే సినిమాలో మహేష్ తో పాటుగా మరో టాలీవుడ్ స్టార్ హీరో కూడా సినిమాలో ఉంటాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కలిపి సినిమా చేస్తున్న రాజమౌళి మహేష్ తో చేసే సినిమా కూడా మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తాడని అంటున్నారు. అదే జరిగితే మరోసారి తెలుగు సినిమా స్టామిలా ఏంటో ప్రూవ్ అవుతుంది. ఆర్,ఆర్.ఆర్ టిప్ బాహుబలి రికార్డులపై కన్నేసిన జక్కన్న. మహేష్ సినిమాతో ట్రిపుల్ ఆర్ రికార్డులు కొల్లగొట్టేలా చూస్తున్నారు. రాజమౌళి దృష్టి పెట్టాడు అంటే అది ఎలాంటి రికార్డ్ అయినా బ్రేక్ అవ్వాల్సిందే.               

మరింత సమాచారం తెలుసుకోండి: