కియారా అద్వానీ.. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన కియారా అద్వానీ.. ఆ తర్వాత భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.దోని జీవిత కథపై తెరకెక్కించిన ‘ఎం.ఎస్.దోని ది అన్టోల్డ్ కహాని’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకుంది. ఇక తెలుగులో సూర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీతోనే సూపర్ హిట్ కూడా కొట్టింది ఈ బ్యూటి.
ఇక బోయపాటి దర్శత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో కూడా కియారా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత మరో తెలుగు చిత్రాన్ని ఎంచుకోలేదు. అలాగే అటు బాలీవుడ్లో ఈ భామ షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ సక్సెస్తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.
ఇటీవల కియారా అద్వానీకి సంబంధించిన న్యూడ్ పిక్ సోషల్ మీడియా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫేమస్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ తీసిన ఈ ఫోటో షూట్ హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. ఈ పిక్ చూసిన నెటిజన్లు తెగ ట్రోల్స్ కూడా చేశారు. అప్పుడు కియారా పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే.. కియారా ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను నెట్టింట్లో పెడుతూ చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం కూడా కియారా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.