రాజమౌళి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. ఈయన చేసిన ఈగ, మగధీర, బాహుబలి మంచి విజయాలను సాధించాయి. వీటిలో మనం ప్రత్యేకంగా చెప్పుకునేది బాహుబలి. ఈ సినిమా తరువాత రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి rrr సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మల్టీ స్టారర్ మూవీ గా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా మొదటి నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కుంటు వస్తుంది, ఈ సినిమా విడుదల చాల సార్లు వాయిదా పడుతూ వస్తుంది. 

 

రాజమౌళి మాత్రం ఎక్కడ తగ్గకుండా మహేష్ తో మరొక మల్టీ స్టారర్ మూవీ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా ఖాళీ గా ఉంటున్న జక్కన, ఇటీవల ఒక న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తరువాత చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో నని  స్పష్టం చేసారు. అయితే వీరిద్దరి కాంబో లో ఇది మొదటి చిత్రం కావడం విశేషం. ఈ సంచలనాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

అయితే మహేష్ మాత్రం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పై ఏ విధంగాను స్పందించలేదు. మహేష్ చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు మంచి విజయాన్ని అందుకుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. ప్రస్తుతానికి మహేష్ పరశురాం తో ఒక సినిమా చేస్తున్నారు. అయితే రాజమౌళి తో చెయ్యబోతున్న ఈ సినిమా వివరాలు ఈ నెల 31 న సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మ దిన వేడుకుల సందర్భంగా వెల్లడించనున్నట్లు సినీ వర్గాల కథనం. అయితే రాజమౌళి మరియు మహేష్ యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: