టాలీవుడ్ లో మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకు పోతున్నాడు. మహర్షి తర్వాత ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకు పోటీగా వచ్చి మరీ బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ వరుస హిట్లతో తిరుగులేని ఫామ్ లో ఉన్నా ఇప్పుడు ఆయన కాస్త టాలీవుడ్ లో ఇబ్బంది పడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఆయన విషయంలో నిర్మాతలు కాస్త అసహనంగా ఉన్నారు అని వార్తలు వచ్చాయి. దీనితో మహేష్ బాబు అప్పటి నుంచి ఎవరి తో సినిమా చెయ్యాలి అనే సందేహంలో ఉన్నారు అని కూడా ప్రచారం జరిగింది.
మహేష్ బాబు సినిమా చేయడానికి గానూ కొందరు దర్శకుల వెంట ... నిర్మాతల వెంట పడ్డారని చాలా మంది నిర్మాతలు ఆయన్ను ఇబ్బంది పెట్టారు అనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. మహేష్ అలా అడగడం నచ్చని... నమ్రత ఒక యువ దర్శకుడికి అవకాశం ఇవ్వాలి అని భావిస్తున్నట్టు సమాచారం. పరుశురాం సినిమా మహేష్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. సరిలేరు తర్వాత మహేష్ ఏ డైరెక్టర్తో సినిమా చేయాలో తెలియక సతమతమవుతోన్న పరిస్థితి.
పరశురాం కూడా మహేష్ విషయంలో అటు ఇటు గా ఉన్న నేపధ్యంలో... మహేష్ అతడిని కూడా పక్కన పెట్టేసి కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇవ్వాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఒక షార్ట్ ఫిలి౦ తీసిన దర్శకుడికి అవకాశం ఇచ్చి సినిమా నిర్మాణం మొత్తం తామే తీసుకోవాలని ఆమె భావించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి సినిమాను ఎప్పుడు చేస్తారు అనేది చూడాలి.